హైదరాబాదులో దొంగల అరాచకం రాజ్యమేలుతోందా.? పక్కాగా రెక్కీ నిర్వహించి పకడ్భంధీగా దోంగలు దోపిడికి యత్నించారా.? హైటెక్ సిటీకి చేరువలోని చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు బీభత్సం చూస్తే ఔనని చెప్పకతప్పదు. ఇదివరకు ఒంటరి మహిళలు, వృద్దులను మాత్రమే టార్గెట్ చేసే దొంగలు తమ పంథాను మార్చారు. ఒంటరిగా వుంటున్న యువకులను కూడా దారుణంగా కొట్టి భయకంపితుల్ని చేసి వారింట్లోని ఖరీదైన వస్తువులను చోరీ చేసి పరారవుతున్నారు. తాజాగా చందానగర్ పోలిస్ స్టేషన్ పరిధిలోని గంగారం పరిధిలోగల ఇంజనీర్స్ ఎన్ క్లేవ్ లో అదే జరిగింది.
ఎవరి కోసమే వాకాబు చేస్తున్నట్లు వచ్చి మంచినీళ్లు కావాలంటూ అడిగి.. లోపలికి ప్రవేశించి అరాచకం చేశారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఇంటిలోకి ప్రవేశించి కుర్చీలో కట్టేసి ఇళ్లు గుళ్ల చేసి వదిలిపెట్టారు అగంతకులు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక హుడా కాలనీ సమీపంలోని ఇంజినీర్స్ ఎన్ క్లేవ్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అయిన మామిళ్లపల్లి శ్రీహర్ష (28), అతడి స్నేహితుడు సాయిరాం ప్రసాద్ ఉంటున్నారు. గురువారం రాత్రి ఏడు గంటల సమయంలో స్నేహితుడు బయటకు వెళ్లగా శ్రీహర్ష ఒక్కడే ఉన్నాడు. ఆ సమయంలో ఇద్దరు ఆగంతుకులు వచ్చి ‘‘ఎత్తుగా ఉన్న వ్యక్తి లేడా?’’ అని ప్రశ్నించారు.
బిజినెస్ గురించి మాట్లాడాల్సి ఉందని చెప్పడంతో.. వస్తాడు కూర్చోమని శ్రీహర్ష చెప్పాడు. అనంతరం వారు మంచినీళ్లు అడగడంతో తీసుకొచ్చేందుకు కిచెన్ లోకి వెళ్తుండగా వెనక నుంచి వెళ్లి శ్రీహర్షపై దాడిచేశారు. తలను గోడకేసి కొట్టడంతో కూలబడిపోయాడు. ఆ వెంటనే అతడి చేతుల్ని తీగలతో కట్టేసి నోట్లో గుడ్డలు కుక్కి మరోమారు దాడిచేశారు. మా అన్న జోలికి వస్తే పరిణామాలు ఇలానే ఉంటాయని, చస్తావని వదిలేస్తున్నామని హెచ్చరించి వెళ్లిపోయారు. వెళ్తూ వెళ్తూ ఓ ల్యాప్ టాప్, రెండు సెల్ ఫోన్లు, ఒక ఏటీయం కార్డుతోపాటు రూ. 3,500 నగదు తీసుకెళ్లిపోయారు.
ఆ తర్వాత రూముకు వచ్చిన సాయిరాం స్నేహితుడి కట్లు విప్పి ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 15న స్థానికంగా నివసించే ఓ వ్యక్తి మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి కారులో వచ్చి శ్రీహర్ష, సాయిరాంలను దూషించడమే కాకుండా దాడి చేసి కొట్టాడు. దీంతో బాధితులు అదే రోజు వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజా ఘటనకు అదే కారణమై ఉంటుందని భావిస్తున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more