గ్లోబల్ వార్మింగ్పై ప్రపంచ మానవాళికి అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తూనే వున్నారు పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు. మంచుకొండలు కరుగుతున్న క్రమంలో అప్రమత్తమైన వారు.. సముద్రంలో నీటి మట్టాలు కూడా పెరుగుతున్నాయని కూడా ప్రజలకు చెబుతూనే వస్తున్నారు. అయినా నా ఒక్కడితో పర్యావరణానికి ముప్పేం వాటిల్లిందన్న ధోరణితో ప్రజలు ఎవరికి వారు తిలోదకాలు చెబుతూనే వున్నారు. రాత్రి వేళ ఒక గంట పాటు విద్యుత్ దీపాలను అర్పి వేయడం.. ఇత్యాధి కార్యక్రమాలతో అసలు గ్లోబల్ వార్మింగ్ ముప్పు ఎలా వుంటుందో కూడా అర్థం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
పర్యావరణంలో గ్లోబల్ వార్మింగ్ వల్ల వస్తున్న మార్పులను శాస్త్రవేత్తలు చెబుతన్న ప్రకారం సముద్రంలో నీటిమట్టం అంతకంతకూ పెరగతుందన్నందుకు సాక్ష్యం.. ఈ వీడియో. సముద్ర తీరంలో కొన్నేళ్ల క్రితం నిర్మితమైన ఈ రెండంతస్తుల భవనం.. క్రమంగా పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలతో నీరు భవనం పునాదులకు చేరుకున్నాయి. సముద్రపు అలల ధాటికి పునాదులు బలహీనంగా మారాయి. ఇంకేముంది భవనం సముద్రంలో కుప్పకూలిన ఘటన బ్యునోస్ ఎయిర్స్లో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో ఇప్పుడు నెటిజన్లను షాక్కు గురిచేస్తోంది.
అర్జెంటినాలో ఈ నెల (జులై) 28న బ్యునోస్ ఎయిర్స్లోని మర్ దెల్ తుయు ప్రాంతం నుంచి ఈ వీడియోను కెమెరాలో బంధించారు. సముద్రంలో ఎగిసిపడిన అలలతో ఇంటి ఫౌండేషన్ దెబ్బతిన్న కారణంగా రెండంతస్తుల భవనం సముద్రంలో కూలిందని నిపుణులు చెబుతున్నారు. తీర ప్రాంతం కోతకు గురవుతున్న క్రమంలో ఇలాంటి పరిణామాలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. కాగా ఘటన జరిగిన సమయంలో యజమానులు ఇంటిలో లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. కాగా పర్యావరణ హితం కోసం మైనింగ్ పేరుతో జరుగుతున్న అక్రమ తవ్వకాలను నిలిపివేయకపోతే మరెన్ని వైపరిత్యాలు మానవాళి ఎదుర్కోవాల్సి వస్తుందో.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more