పెగాసస్ స్పైవేర్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగాసెస్ ఫోన్ హ్యాకింగ్ వ్యవహారంలో మన దేశానికి చెందిన రాజకీయ నేతలు, ప్రముఖులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులపైనా నిఘా కొనసాగిందన్న గత కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీనిని ఇజ్రాయిల్ లోని ఎన్ఎస్ఓ గ్రూపు సంస్థ రూపోందించిందని, ఇది ఈ స్పైవేర్ ను ప్రభుత్వాలకు విక్రయిస్తుందని ఆ సంస్థ ప్రతినిధులే అంగీకరించారు. కాగా ఈ సంస్థపై ఇజ్రాయెల్ ప్రభుత్వ అధికారులు దాడులు చేసిన విషయం కూడా తెలిసిందే.
అయితే ఈ సంస్థ ఇచ్చిన స్పైవేర్ తో మన దేశంలో ఎవరిపై నిఘా పెట్టారన్న వివరాలపై భారత పార్లమెంటులో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు లోక్ సభలోనూ. ఇటు రాజ్యసభలోనూ పెగాసెస్ అంశాన్ని కేంద్రప్రభుత్వం చర్చించకపోవడంతో విపక్షాలు అందోళనలు చేపడుతున్నాయి. దీంతో తమ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న అరోపణలు విస్తృతంగా వినబడుతున్న క్రమంలో ప్రముఖ జర్నలిస్టులు ఎన్ రామ్, శశికుమార్ ఇందులోని నిజానిజాలను నిగ్గుతేల్చాలని కోరుతూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తలుపుతట్టారు.
పార్లమెంట్ ఉభయసభలను పెగాసెస్ అంశం కుదిపేస్తున్నాయి. ఈ వివాదాన్నే ఎత్తిచూపుతూ ప్రతిపక్షాలన్నీ ఏకమై నిరసన తెలియజేస్తున్నాయి. ఈ పెగాసస్ తో నిఘా అంశంపై విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ.. పలువురు జర్నలిస్టులు సుప్రీంకోర్టులో కొన్ని రోజుల క్రితం ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) దాఖలు చేశారు. తాజాగా ఆ పిల్ ను సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. వచ్చే వారం విచారిస్తామని తెలిపింది. సీనియర్ లాయర్, కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణకు అంగీకారం తెలిపింది.
కొందరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, స్వచ్ఛంద కార్యకర్తలు, పౌర సంఘాల నేతల ఫోన్లపై పెగాసస్ తో నిఘా పెట్టారన్న ఆరోపణలు గుప్పుమన్న సంగతి తెలిసిందే. దీనిపై సిట్టింగ్ లేదా విశ్రాంత న్యాయమూర్తితో స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఈ నెల 27న సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. కేంద్ర ప్రభుత్వం పెగాసస్ ను కొనుగోలు చేసిందా? లేదా? అన్న విషయాన్ని తెలియజేసేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని అందులో పిటిషనర్లు కోరారు. సైన్యం వాడే స్పైవేర్ ను సామాన్య ప్రజల మీద ప్రయోగించడమంటే రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు. ఫోన్లపై నిఘా పెట్టడం వ్యక్తిగత జీవితంపై దాడి చేయడమేనని తెలిపారు. ఇది నేరపూరితమైన చర్య అని వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more