అంతరిక్ష పరిశోధనా కేంద్రం స్థానభ్రంశానికి గురైంది. రష్యాకు చెందిన సైన్స్ ల్యాబ్ ను ఇంటర్నేషనల్ స్పెస్ స్టేషన్ తో అనుసంధానం చేసే అమరికలో వైఫల్యం కారణంగా భారీ కుదుపునకు గురైంది. దీంతో ఆ స్పేస్ స్టేషన్ 45 డిగ్రీల మేర మరోవైపు కదిలింది. రష్యాకు చెందిన సైన్స్ ల్యాబ్ అనుసంధానం తరువాత ప్రమాదవశాత్తు ఆ ల్యాబ్ థ్రస్టర్లు ఫైర్ అయ్యాయి. దీంతో ఏకంగా 47 నిమిషాల పాటు అంతరిక్ష పరిశోధనా కేంద్రం తన ఓరియంటేషన్ పై నియంత్రణను కోల్పోయింది.
దీంతో 22 టన్నుల బరువు, 43 అడుగుల పోడవు వున్న ఈ సైన్స్ ల్యాబ్ కు నౌకాగా నామకరణం చేసిన రష్ట్యాకు చెందిన వ్యోమగాములు థ్రస్టర్ల మధ్య లీకులతో పాటు దాని మాడ్యూల్ లోని లీకులను కూడా పరిశీలిస్తున్నారు. మాడ్యూల్ ను డాకింగ్ చేసిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నది. ఈ ఘటనతో కంట్రోల్ స్టేషన్లతోనూ అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి రెండు పర్యాయాలు పలు నిమిషాల పాటు అనుసంధానానికి విఘాతం కలిగిందని కూడా నాసా వర్గాలు తెలిపాయి.
అయితే అంతరిక్ష శాస్త్రవేత్తలు స్పేస్ స్టేషన్ ను మళ్లీ సరైన ఆల్టిట్యూడ్ లో పెట్టారు. ఈ ఘటన వల్ల ఆ అంతరిక్ష కేంద్రంలో ఉన్న వ్యోమగాములకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. అటోమేటిక్ సెన్సార్ల సాయంతో మిషన్ కంట్రోల్ బృందాలు.. స్పేస్ స్టేషన్లో జరిగిన లోపాలను గుర్తించాయి. ఆ వెంటనే లోపాలను సరిదిద్దారని, ప్రస్తుతం అన్ని సిస్టమ్స్ సాధారణంగా ఆపరేట్ అవుతున్నట్లు నాసా స్పేస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ఇక ప్రస్తుతం స్పెస్ స్టేషన్ కదలిక కూడా స్థిరంగా వుందని తెలిపింది.
ప్రమాదం జరిగిన సమయంలో సెకను అర డిగ్రీ మేర స్పేస్ స్టేషన్ తన అలైన్ మెంట్ నుంచి పక్కకు జరిగిందని, దీంతో అందులోని వ్యోమగాములకు కూడా పెద్దగా కదలిక గురించి తెలియలేదని నాసా స్పేస్ స్టేషన్ మేనేజర్ జోయెల్ మోన్టల్ బానో తెలిపారు. ప్రస్తుతం స్పేస్ స్టేషన్లో అమెరికా, రష్యాకు చెందిన ఏడు మంది సిబ్బంది ఉన్నారు. మాడ్యూల్ను ఫిక్స్ చేసిన కొన్ని గంటల తర్వాత స్పేస్ స్టేషన్ అదుపు తప్పినట్లు నాసా చెబుతోంది. ఆ సమయంలో వ్యోమగాములతో కమ్యూనికేషన్ దెబ్బతిన్నట్లు నాసా పేర్కొన్నది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more