వైద్య విద్య కోర్సులను అన్ని వర్గాలకు చేరువ చేయడంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డెంటల్, మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఓబీసీ 27 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది. యూజీ, పీజీ, డెంటల్, మెడికల్ కోర్సులకు రిజర్వేషన్లు వర్తిస్తాయని తెలిపింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి వస్తాయని కేంద్రం స్పష్టం చేసింది. ఓబీసీ 27 శాతం, ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
దీనికి సంబంధించి జులై 26న ప్రధాని మోడీ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారు. చాలా ఏళ్లుగా ఓబీసీలు, వెనకబడిన వర్గాలకు వైద్య విద్యలో రిజర్వేషన్లకు సంబంధించిన అంశం పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి త్వరిత గతిన నిర్ణయం తీసుకోవాలని ప్రధాని ఆదేశించడంతో ఈరోజు ఉత్తర్వులను వెలువరించారు. ఆల్ ఇండియా కోటాలో రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ప్రతి ఏటా 5550 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగబోతుంది. సామాజిక న్యాయంలో ముఖ్యంగా కొత్త అధ్యాయంగా దీన్ని ప్రధాని మోడీ అభివర్ణించారు.
ఎంబీబీఎస్ లో ప్రతి ఏడాది 1500 మంది విద్యార్థులకు, పీజీలో 2500 మంది ఓబీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అమలు కాబోతున్నాయి. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన 550 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు, పీజీలో 1000 మంది మందికి ఈ రిజర్వేషన్లు అందుబాటులోకి రాబోతున్నాయి. సుప్రీంకోర్టు 1986లోనే ఆల్ ఇండియా కోటాను ప్రవేశపెట్టింది. ఆల్ ఇండియా కోటాలో భాగంగా అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి వెళ్లి చదువుకునే వారికి ఈ రిజర్వేషన్లు ఎంతగానో దోహదం పడనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more