మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతుంది. 45 రోజులుగా సీబీఐ విచారణను కోనసాగిస్తోంది. కాగా తాజాగా ఈ కేసులో సిబిఐ చేతికి కీలక అధారం లభించిందని సమాచారం. ఈ కేసు విచారణలో భాగంగా వైఎస్ వివేకాకు సన్నిహితులు, హత్యకేసులో అనుమానం ఉన్నవారిని సీబీఐ అధికారులు విచారించారు. ఇక ఈ నేపథ్యంలోనే శుక్రవారం వివేకా వాచ్ మెన్ తోపాటు కార్ డ్రైవర్ దస్తగిరిని విచారించారు. సెక్షన్ 164 ప్రకారం జమ్మలమడుగు న్యాయస్థానంలో వీరిని విచారించినట్లు అధికారులు తెలిపారు.
కాగా, వాచ్ మెన్ రంగయ్య, డ్రైవర్ దస్తగిరి నుంచి కీలక విషయాలు రాబట్టారు. రెండుగంటల పాటు వీరిని విచారించి స్టేట్మెంట్ రికార్డు చేసుకున్నారు. వివేకా హత్యకేసులో తొమ్మిది మందికి సంబంధం ఉన్నట్లు వాచ్ మెన్ రంగయ్య చెప్పినట్లు తెలుస్తుంది. ఈ తొమ్మిది మంది వివరాలను కూడా వెల్లడించినట్లు తెలుస్తుంది. ఇక రంగయ్య స్టేట్మెంట్ ప్రకారం వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. కాగా గత మూడు రోజులుగా రంగయ్యను విచారిస్తున్నారు సీబీఐ అధికారులు. ఈ నేపథ్యంలోనే అతడి నుంచి కీలక ఆధారాలు సేకరించారు.
తొమ్మిది మంది కలిసి ఈ హత్య చేసినట్లు రంగయ్య తెలిపారు. ఈ హత్య కేసు విషయంలో సీబీఐ గత 45 రోజులుగా ఏకంగా 1600 మందిని సీబిఐ అధికారులు విచారించారు. వివేకానందరెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే గంగిరెడ్డి, గంగాధర్, జగదీశ్వర్ రెడ్డితోపాటు, మరికొందరిని విచారించారు సీబీఐ అధికారులు. తాజాగా వాచ్మెన్ రంగయ్యను విచారించడంతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more