చత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు మరోమారు ఎదురుదుబ్బ తగిలింది. వారం రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. తాజాగా నిన్న రాత్రి జరిగిన ఎన్ కౌంటర్లోనూ ముగ్గురు మావోయిస్టులను పోలీసు బలగాలు హతమార్చాయి. గత వారం రోజుల వ్యవధిలో ఇది రెండో ఎన్ కౌంటర్.. అయితే ఈ ఎన్ కౌంటర్లో హతులైన ముగ్గురు మావోయిస్టులపై లక్ష రూపాయల రివార్డులను ప్రకటించబడి వున్నాయి. హతులైన మావోయిస్టుల నుంచి ఆయుధాలను పోలీసుల బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ఛత్తీస్ గడ్ లోని దంతేవాడ జిల్లాలోని జరిగిన ఎన్ కౌంటర్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలావున్నాయి, దంతెవాడ జిల్లాలోని దోల్కాల్ హిల్స్ అటవీ ప్రాంతంలో మావోలు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారాన్ని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందుకున్న డీఆర్జీ పోలీస బలగాలు ఫరాస్ పాల్ పోలిస్ స్టేషన్ పరిధిలో ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిలు ఎధురుపడి.. కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపడంతో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. వీరిని మిలటరీ ప్లాటూన్ కమాండర్ బిర్జు కాకెమ్ (35), ఆర్పీసీ ఉపాధ్యక్షుడు జగ్గూ కాకెమ్ (30), మిలీషియా ప్లాటూన్ సభ్యుడు అజయ్ ఒయామీ (26)గా గుర్తించారు.
మృతుల్లో బైరాంగఢ్ ఏరియా కమిటీకి చెందిన మావోయిస్టులు హతమయ్యారని, వీరి ముగ్గురిపై లక్ష రూపాయల మేర రివార్డు కూడా ప్రకటించబడి వుందని దంతేవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ తెలిపాడు. అయితే ఎదురుకాల్పుల నేపథ్యంలో పలువురు మావోయిస్టులు అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయారని వారి కోసం అటవీ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టామని చెప్పారు. ఇక మరణించిన ముగ్గురు మావోల నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు, మూడు స్వదేశీ తుపాకులు, 3 కిలోల ఐఈడీ బాంబులు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్న వాటిలో వున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more