‘‘మీకు ఏదైనా సమస్యా.? అయినా ఏం ఫర్వాలేదు.. మీ సమస్యను నేను పరిష్కరిస్తాను.. సమస్యను దూరం చేసేందుకు ప్రార్థన చేస్తాను. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఏకంగా దేవుడితోనే మాట్లాడతాను. నేను దైవదూతను. నన్ను నమ్మండీ మీ సమస్యలను నాకు వదిలేయండీ.. ఇక వాటిని మీరు మర్చిపోండి..’’ అని నోటికి వచ్చిన మాటలను తీయగా వల్లిస్తే.. ఎవరైనా కొంత సమస్య వున్నవారు వారి మాటలకు వారి ట్రాప్ లో పడకమానరు. అలాగే కష్టాల్లో ఉన్న యువతులను నమ్మిస్తూ వారికి శఠగోపం పెట్టిందీ ఓ యాయలాడి.
అమాయక యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకొని లక్షలాది రూపాయలు దండుకుంటూ మోసాలకు పాల్పడుతున్న నిందితురాలిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అయితే ఈ నిందితురాలు ఏకంగా యాభై ఏళ్లలోనూ యువతులకు టోకరా వేయడం పోలీసులను ఆశ్చర్యపర్చింది. వివరాల్లోకి వెళ్తే... కూకట్పల్లి వెంకటరమణ కాలనీ, గోకుల్ ప్లాట్స్లో నివసించే సంజన కొంత కాలంగా అమాయక యువతుల బలహీనతలను ఆసరాగా చేసుకుంటూ వారిని కష్టాల నుంచి దూరం చేసేందుకు తాను దేవుడితో మాట్లాడతానని, ప్రార్థనలు చేస్తానని చెప్పి నమ్మించింది.
ఇటీవల ఓ పెళ్లి సంబంధం వచ్చి తప్పిపోయిన సందర్భంగా జూబ్లీహిల్స్కు చెందిన యువతి ఆమె ట్రాప్లో పడింది. ఈ జీవితాన్ని గాడిలో పెడతానంటూ పలు దఫాలుగా ఆమె దగ్గరి నుంచి రూ.70 లక్షల దాకా వసూలు చేసింది. ఆలస్యంగా తెలుసుకున్న బాధితురాలి తండ్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సంజన గుట్టురట్టైంది. అమాయక యువతులను బుట్టలో వేసుకుంటూ తన అకౌంట్లోకి డబ్బులు రాబట్టుకుందని తేలింది. దీంతో నిందితురాలిపై పోలీసులు ఐపీసీ సెక్షన్ 406, 420, 508 కింద క్రిమినల్ కేసులు నమోదు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. తాజాగా నిందితురాలిపై ఓ బాధితురాలు హుమాయన్నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయగా అక్కడ మరో కేసు నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more