Petrol price moves up further, diesel rate a tad slower మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. కొత్త గరిష్టానికి చేరిన పెట్రోల్ ధర

Petrol touches record high on july 15 breaches rs 107 litre in mumbai

Petrol Diesel prices, petrol diesel price hike, petrol prices in delhi, diesel prices in delhi, effect of covid 19 on petrol prices, effect of covid 19 on diesel prices, petrol price, petrol rate, petrol rate today India, diesel rate, diesel price, diesel rate today, diesel rate today in India, today petrol rate, today diesel rate, Petrol rate in Hyderabad, diesel rate in Telangana, diesel rate in Andhra Pradesh, diesel rate in Hyderabad, diesel rate in Guntur, diesel rate in Chennai, diesel rate in Vijayawada, diesel rate in Amaravati, diesel rate in Visakhapatnam, diesel rate in Delhi, diesel rate in Chennai, diesel rate in India, Petrol rate in Telangana, petrol rate in Andhra Pradesh, petrol rate in Delhi, petrol rate in Mumbai, Petrol rate in Hyderabad, Petrol rate in Visakhapatnam, fuel rates today in India, fuel rates, fuel price in India

After remaining unchanged for a two days, petrol prices were hiked on Thursday, July 15, 2021, touching a record high across the country, adding more misery to the common man already grappling with rising food prices amid shrinking income. In the national capital, the petrol price rose 35 paise while that of diesel hiked by 15 paise.

మళ్లీ పెరిగిన ఇంధన ధరలు.. కొత్త గరిష్టానికి చేరిన పెట్రోల్ ధర

Posted: 07/15/2021 02:52 PM IST
Petrol touches record high on july 15 breaches rs 107 litre in mumbai

డెబై ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఎన్నడూ ఎరుగని రీతిలో ఇంధన ధరలు పైపైకి ఎగబాగుతూ.. చరిత్రలో కొత్త శిఖరాలను అందుకుంటున్నాయి, చమురు ధరల పెంపుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని చె్ప్పిన కేంద్రం.. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 4 నుంచి వరుసగా ఇంథన దరలను పెంచూతూ వస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని మెట్రో నగరాల్లో వంద రూపాయలు దాటిన ఇంధన ధర.. చారిత్రక గరిష్టాన్ని తాకింది. ఇంధన ధరలను చమురు కెంపెనీలు ఏకంగా మే నెలలో 16వ సారి ఇంధన ధరలను పెంచూతూ నిర్ణయం తీసుకున్నాయి. జూన్ నెలలో 16 సార్లు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. జూలైలో అప్పుడే తొమ్మిది పర్యాయాలు పెంచింది కేంద్రం.

గత ఏడాది మాత్రం లాక్ డౌన్ లో ఇంధన ధరల పెంపుకు బ్రేకులు వేసిన కేంద్రం.. అన్ లాక్ తరువాత క్రమంగా పెంచుతూ వచ్చింది. ఫలితంగా ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర వంద రూపాయలకు చేరుకుంది. తాజాగా దేశరాజధాని ఢిల్లీలోనూ పెట్రోల్ ధరల 101.54 రూపాయలకు చేరువలో వుంది. దీంతో పాటు దాదాపుగా దేశంలోని అన్ని మెట్రోపాలిటిన్ నగరాలతో పాటు 13 రాష్ట్రాల్లో పెట్రోల్ ధర రూ.105ను మించి పరుగులు పెడుతొంది. దేశంలో ఈ ఇంధనం సరికొత్త ఎత్తును అందుకుని కోనసాగడం చారిత్రక గరిష్టంగానే చెప్పుకోవచ్చు. ఇక తాజాగా డీజిల్ దర కూడా వంద మార్కును అందుకునే దిశగా కదులుతోంది.  

అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్‌ ముడి ధర బ్యారెల్‌కు 76.09 డాలర్లు దాటింది. ట్రేడింగ్‌ ముగిసే సమయానికి బ్రెంట్‌ 0.62 డాలర్లు పెరిగి.. యూఎస్‌ మార్కెట్‌లో బ్యారెల్‌కు 76.18 డాలర్లకు చేరింది. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ 0.75 డాలర్లు పెరిగి.. బ్యారెల్‌కు 74.05 డాలర్లు పలికింది.ఈ మేరకు పెట్రోల్‌, డీజిల్ ధరలను పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.  ప్రభుత్వ చమురు కంపెనీలు ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలను మరోసారి పెంచాయి. దేశీయ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలు రెండూ పెరిగాయి.

ఇప్పటికే రికార్డు స్థాయికి ధరలు చేరగా.. మరోసారి పెట్రోల్‌ లీటర్‌కు 39 పైసలు మేర పెంచిన ఇంధన సంస్థలు, డీజిల్‌ ధర 21 పైసల మేర కోనసాగిస్తున్నాయి. మే 4 నుంచి ఇప్పటివరకు చమురు ధరను 38 పర్యాయాలు పెంచిన కేంద్రం.. ఏకంగా అప్పట్నించి తాజా పెంపు వరకు పెట్రోల్ పై రూ.11.14, డీజిల్‌పై 9.14 వరకు చమరు కంపెనీలు పెంచాయి. ఫలితంగా పెట్రోల్-డీజిల్ ధరలు దేశంలో రికార్డు స్థాయికి చేరుకుంది. రాజస్థాన్ సహా మధ్యప్రదేశ్ రాష్ట్రాలోని పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 110కి చేరుకోగా..  తెలుగు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర ఏకంగా రూ.107 దాటింది.

తాజాగా దేశవ్యాప్తంగా మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు ఎలా వున్నాయంటే...

ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర 101.54గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.89.87కు చేరింది.
ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.107.54గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.97.45కు చేరింది.
చెన్నైలో లీటరు పెట్రోల్ ధర రూ.102.23గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 94.39కు చేరింది.
కొల్ కతాలో లీటరు పెట్రోల్ ధర రూ.101.74గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ.93.02కు చేరింది.
అమరావతి గుంటూరులో పెట్రోల్ ధర రూ..108.25 కాగా, లీటరు డీజిల్ ధర రూ.99.48కు చేరింది.
హైదారాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.105.52గా నమోదు కాగా, లీటరు డీజిల్ ధర రూ. 97.96కు చేరింది.
బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ.104.94గా నమోదు కాగా, లీటరు  డీజిల్‌ రూ.95.26కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol  Diesel  fuel price  petrol price  diesel price  hyderabad  visakhapatnam  coronavirus  covid-19  

Other Articles