భారత్ లో కరోనావైరస్ సోకిన తొలి పేషెంట్ మరోమారు మహమ్మారి బారిన పడింది. ఏడాదిన్నర కాలం తరువాత మరోమారు అమె కరోనా వైరస్ బారిన పడింది. చైనాలోని మెడికల్ కాలేజ్లో చదువుతున్న కేరళలోని త్రిసూర్ కు చెందిన విద్యార్థిని.. అక్కడ అత్యైక పరిస్థితులు నెలకోనడంతో భారత్ కు తిరిగి వచ్చింది. భారత్ కు చేరుకున్న తరువాత అమె కరోనా మహమ్మారిన పడింది. సరిగ్గా జనవరి 30 2020న అమె కరోనా బారిన పడింది. దీంతో అమె దేశంలో తొలి కరోనా పేషెంట్గా నిలిచిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అమె మరోమారు కరోనా మహమ్మారి బారిన పడింది. అయితే అమెలో ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం తన విద్యాను కొనసాగించేందుకు న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్న అమె తాజాగా కరోనా పరీక్షలు చేయించుకుంది. అయితే అమెకు తొలుతు వైద్యులు యాంటీజెన్ టెస్టు నిర్వహించగా ఆమెకు నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో మరోమారు వైద్యాధికారులు అమెకు ఆర్టీ పీసీఆర్ టెస్టు నిర్వహించగా అందులో పాజిటివ్ గా తేలింది. అమెకు లక్షణాలు లేని కరోనా సోకిందని నిర్థారించిన వైద్యులు అమెకు చికిత్స అందించారు. అయితే తాను ఇంట్లోనే ఐసోలేట్ అవుతానని చెప్పడంతో వైద్యులు అమెకు మెడిసిన్ ఇచ్చారు.
కాగా ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు చెప్పారు. గత ఏడాది 30 జనవరి 2020 ఆమెకు కరోనా సోకింది. దీంతో ఇరవై రోజుల పాటు త్రిస్పూర్ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో వైద్యులు చికిత్స అందించారు. రెండు పర్యాయాలు అమెకు పరీక్షలు నిర్వహించిన తరువాత అమెకు నెగిటివ్ నివేదిక వచ్చిన తరువాత 20 ఫిబ్రవరి 2020న అమెను వైద్యాధికారులు అసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. ఆ తర్వాత ఆమెతోపాటు వుహాన్కు వెళ్లిన మరో ఇద్దరు స్నేహితురాళ్లకు కూడా పాజిటివ్ గా తేలింది. వారికి కూడా వైద్యాధికారులు చికిత్స అందించడంతో వారు కరోనా నుంచి బయటపడ్డారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more