పంజాబ్ నేషనల్ బ్యాంకులోని ప్రజల సోమ్మును రుణంగా పోంది ఏకంగా 13 వేల 500 కోట్ల రూపాయలను ఉద్దేశపూర్వకంగా ఎగొట్టి విదేశాలకు పారిపోయిన భారత వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సికి డొమినికా హైకోర్టులో ఊరట లభించింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం మెడికల్ గ్రౌండ్స్ పై మాత్రమే చోక్సీకి బెయిల్ మంజూరు చేసింది. ఈ బెయిల్ నేపథ్యంలో ఆయన చికిత్స నిమిత్తం అంటిగ్వాకు వెళ్లే అవకాశాన్ని కూడా న్యాయస్థానం కల్పించింది.
అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చోక్సీకి మంజూరు చేసిన బెయిల్.. ఒక విధంగా భారత ఏజెన్సీ వర్గాలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది. ఆయనకు బెయిల్ మంజూరైన విషయాన్ని ఆయన న్యాయవాది విజయ్ అగర్వాల్ కూడా ధృవీకరించారు. ఔను మెహుల్ చోక్సీకి డొమినికా హైకోర్టు బెయిల్ మంజూరు చేసిందని చెప్పారు. ఆయన అరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయస్థానం అయనకు బెయిల్ మంజూరు చేసిందని అన్నారు . అంటిగ్వా నుంచి క్యూబాకు పారిపోతూ డొమినికా బీచ్ లో చోక్సీ పట్టుబడ్డాడు. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించాడంటూ ఆయనపై డొమినికా పోలీసులు కేసు నమోదు చేశారు.
దీంతో, మే 23 నుంచి ఆయన డొమినికా జైల్లో ఉన్నాడు. తాజాగా బెయిల్ లభించడంతో డొమినికా నుంచి అంటిగ్వా అండ్ బార్బుడాకు వెళ్లనున్నాడు. 2018లో ఇండియా నుంచి పారిపోయిన చోక్సీ అప్పటి నుంచి అంటిగ్వాలోనే ఉన్నాడు. తాను నరాల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నానని, అంటిగ్వాలోని వైద్యుడిని సంప్రదించడం కోసం తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును చోక్సీ కోరాడు. ఆయన విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డొమినికా కోర్టులో చోక్సీ తరపున ప్రముఖ లాయర్ విజయ్ అగర్వాల్ వాదనలు వినిపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more