అదృష్టం అంటూ ఉండాలే కానీ.. అది భూమి పోరల్లో దాగివున్నా.. తగిన సమయం, సందర్భం వచ్చినప్పుడు తప్పక దరిచేరుతుందని పెద్దలు చెప్పే మాట అక్షరసత్యం అని మరోమారు నిరూపితం అయ్యింది. పొలంలో పనులు చేసేందుకు వెళ్లిన ఓ మహిళకు అరుదైన వజ్రం లభించింది. అరుదైనది కావడంతో దాని ధర కూడా అంతే పలికింది. రాత్రికి రాత్రే మహిళను లక్షాధికారిని చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని జొన్నగరి గ్రామానికి చెందిన మహిళ కష్టాలను ఒక్కదెబ్బతో హరించేట్టు చేసింది.
ఔనా నిజంగానా.. అంటే అంతేనని చెప్పాలి. మామాలుగా రాత్రికిరాత్రి ఓ వ్యవసాయ పనుల కోసం వెళ్లిన మహిళ కుటుంబం లక్షాధికారి కుటుంబంగా మారిపోయింది. పొలం పనులు చేసేందుకు ఉదయాన్నే బయలుదేరిన ఆ మహిళకు అదృష్టం వరించింది. అమె కష్టాలు ఒక్క ఉదుటున తీరిపోయాయి. ఉదయం కూలిపనులకు వెళ్లిన ఆమె రాత్రికి లక్షాధికారిగా మారిపోయింది. అమె ముఖంతో సంతోషం.. ఆ కుటుంబంలో ఆనందం వెల్లివిరిసాయి. ఇంతకీ జరిగిందేమిటంలే అమెకు అరుదైన వజ్రం లభించింది. పొలం పనులు చేస్తుండగా ఓ రాయి మెరుస్తూ కనిపించింది. అంతే దానిని తీసుకుని పరిశీలించగా అది వజ్రం అని తెలిసింది.
వర్షం చినుకులు పడితే చాలు భూమి పోరల్లోంచి వజ్రాలు నేలను చీల్చుకుంటూ బయటపడుతుంటాయన్నది తెలిసిన విషయమే. మరీ ముఖ్యంగా కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ తరహాలో స్థానికులకు వజ్రాలు లభిస్తుంటాయి. దీంతో ఈ జిల్లావాసులతో పాటు సుదూర ప్రాంతాలకు చెందిన వారు కూడా ఇక్కడకు వచ్చి వజ్రాల కోసం వేటను కోనసాగిస్తుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి పోలాలపై అనేకానేలు వాలిపోతుంటారు. కాగా తాజాగా కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామానికి చెందిన ఓ మహిళ పొలంలో కూలి పనులకు వెళ్లింది.
అక్కడ పనులు చేస్తుండగా అరుదైన వజ్రం లభ్యమైనట్లు సమాచారం. ఈ వజ్రం ధర కోట్లలో వున్నా.. దానిని స్థానిక వ్యాపారులు మాత్రం తక్కువ ధరకే కొనుగోలు చేశారని సమాచారం. ఈ వజ్రాన్ని సదరు మహిళ నుంచి రూ.30 లక్షలకు కొనుగోలు చేశారని తెలిసింది. స్థానిక వజ్రం వర్తకులు పలువురు వచ్చి పోటీపడినా మహిళ మాత్రం తనకు రూ.30 లక్షలు ఇస్తానన్న వ్యాపారికే తన వజ్రాన్ని అందించింది. కాగా దానిని నగరంలోని బడా వ్యాపారులకు కోట్లలో విక్రయించి వ్యాపారి లభం పోందుతాడని స్థానికులు గుసగుసలాడుతున్నారు. ఈ ప్రాంతంలో ఏటా తొలకరి వర్షాలకు వజ్రాలు లభ్యమవడం సహజం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more