జమ్ముకశ్మీర్ లోని భారత ఎయిర్ ఫోర్స్ కు చెందిన స్థావరాలపై వరుస డ్రోన్ల కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. అందివచ్చిన అదునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ముష్కరమూకలు జమ్మూలోని ఎయిర్ పోర్స్ సహా సైనిక స్థావరాలపై దాడులకు యత్నిస్తున్నారు. ఇటీవల ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద పేలుళ్లకు కారణమైన ఈ డ్రోన్లను కూకటి వేళ్లతో పెకిళించడానికి భారత్ అధునాతన సాంకేతిక వ్యవస్థను అమలు చేయనుంది. కాగా గత నాలుగు రోజులుగా పాకిస్తాన్ ఉగ్రవాదులు డ్రోన్లతో అలజడి సృష్టిస్తున్నారు. అయితే వాటి ఆటను భారత భద్రతా బలగాలు కట్టిస్తునేవున్నాయి. కాల్పులు జరుపుతున్నా అవి చీకట్లో తప్పించుకు తిరుగుతున్నాయి.
తాజాగా మరోమారు గత రాత్రి మరో మూడు డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి. నిన్న అర్ధరాత్రి 1.30 నుంచి ఈ తెల్లవారుజామున 4 గంటల మధ్యలో జమ్మూలోని వేర్వేరు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్లు సంచరించాయి. మొదట కాలుచూక్ కంటోన్మెంట్ వద్ద ఓ డ్రోన్ కన్పించగా.. ఆ తర్వాత కాసేపటికే రత్నచక్ సైనిక ప్రాంతంలో మరోదాన్ని గుర్తించారు. ఇక మూడోది.. కుంజ్వానీ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ వద్ద కన్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. డిఫెన్స్ ఇన్ స్టాలేషన్స్ సమీపంలో ఇవి కదలాడినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా.. జమ్ము సైనిక స్థావరాల వద్ద గత నాలుగు రోజుల్లో మొత్తం ఏడు డ్రోన్లు సంచరించడం గమనార్హం.
ఈ డ్రోన్ దాడుల వెనుక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉండొచ్చని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. మన సైనిక స్థావరాలపై ఉగ్రవాదులు డ్రోన్లతో దాడులకు దిగడం ఇదే ప్రథమం. దీంతో డ్రోన్లు సంచరించిన ప్రాంతాల్లో భద్రతా బలగాలు అణువణువూ జల్లెడ పడుతున్నాయి. ధాయాది దేశం నుంచి ఉత్పన్నమైన ఈ సరికొత్త ముప్పును తప్పికోట్టేందుకు అత్యాధునిక ఆయుధాలను సైన్యానికి సమకూర్చాలని కేంద్రం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూలో నెలకొన్న తాజా పరిస్థితిని సమీక్షించింది. దేశ భద్రతకు ఏర్పడే కొత్త సవాళ్లను తిప్పకోట్టే క్రమంలో మరింత దృఢమైన చర్యలు తీసుకునే విషయాన్ని చర్చిస్తోందని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more