పెట్రోల్, డీజిల్ రేట్లు భగ్గుమంటున్నాయి.. గతేడాది కరోనా లాక్ డౌన్ తరువాత అన్ లాక్ తో దేశవ్యాప్తంగా అన్ని తెరుచుకున్న క్రమంలో పెరుగుతూ వచ్చిన పెట్రోల్ ధరలు అందనంత ఎత్తుకు ఎగబాకుతున్నాయి. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఏకంగా ఇంధన ధరలపై 30 రూపాయలను మేర పెరిగాయి. దీంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ ధర లీటరుకు 100 ధాటింది. అదే స్థాయిలో డీజిల్ ధర కూడా పలు రాష్ట్రాల్లో వంద రూపాయల మేర దాటింది. దీంతో సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతూన్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలపై సోషల్ మీడియా వేదికగా అనే వార్తలు, జోకులు వైరల్ అవుతున్నాయి.
పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రతిపక్షాలు నిరసన తెలిపినా పెడచెవిన పెట్టిన కేంద్రం ధరల పెంపును కొనసాగిస్తూనే వుంది. దీంతో ఇంధన ధరల పెంపుపై సామాన్యులు కూడా పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లకు నిరసనగా ఓ పెళ్లి బృందం ఎడ్ల బండ్లపై వివాహ వేదికకు వచ్చారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. దేవరియా జిల్లా కుషారీ గ్రామానికి చెందిన ఛోటే లాల్ తన గ్రామం నుంచి 35 కిలోమీటర్ల దూరంలోని పక్రీ బజార్ లో పెళ్లి మండపానికి ఎడ్లబండిపై ఊరేగింపుగా వచ్చాడు. తన బంధుజనం, కట్న కానుకులతో పాటు ఎడ్లబండ్లపై ఊరేగింపును నిర్వహించాడు.
ఈ సందర్బంగా వరుడు మాట్లాడుతూ.. ప్రస్తుతం చమురు ధరలు భారీగా ఉన్నాయని, వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ విధంగా ఎడ్లబండ్లపై పెళ్లి వేడుకకు వెళ్తున్నామని తెలిపాడు. కేంద్రం ఇప్పటికైనా ఇంధన ధరల పెంపును తగ్గించాలని కోరాడు. ఇక దీనికి తోడు దశాబ్దాల క్రితం అప్పటి వారు ఇలానే పెళ్లి చేసుకునేవారని.. ఆ విషయం ఇప్పటి తరం ప్రజలకు తెలియదని, దీంతో దానిని వారికి చూపించాలని కూడా ఇదే మన గత సంప్రదాయమని చెప్పాలని ఎడ్లబండిపై వచ్చానని అన్నారు. ఇది తన చిన్ననాటి కోరిక అని దానికనుగూణంగానే ఇప్పుడు చేసుకున్నానని తెలిపాడు. ఇలా వెళ్లడం వలన వాయు కాలుష్యాన్ని తగ్గించ వచ్చని తెలిపారు ఛోటే లాల్. ఇక ఈ సంక్షోభ సమయంలో ఖర్చులు తగ్గించుకోవాలని హితవు పలికారు.
#WATCH | Deoria: Groom & the ‘baratis’ rode bullock-carts to reach wedding venue in Pakri Bazar from his home in Kushari village, a distance of 35-km today
— ANI UP (@ANINewsUP) June 20, 2021
“I wanted to show people how our ancestors used to take out wedding processions & perform weddings,” said groom Chhote Lal pic.twitter.com/v7pIsdpaON
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more