దేశంలో ఓ వైపు కరోనా విజృంభన కొనసాగుతున్నా.. అభం శుభం తెలియని అప్పుడే పుట్టిన శిశువుల కిడ్నాపింగ్ మాత్రం అగడం లేదు. లాక్ డౌన్ విధించినా, కర్ప్యూలు అములపర్చినా.. కఠిన ఆంక్షలతో ఎక్కడికక్కడ కట్టడి చేసినా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో శిశువును అమాంతం ఎత్తుకెళ్లిపోయారు దుండగులు. కర్నూలు జిల్లాలోని ఆసుపత్రిలో జరిగిన శిశువు కిడ్నాప్ కేసులో మరో ట్విస్టు బయటపడింది. బురఖా వేసుకుని వచ్చిన మహిళే శిశువును ఎత్తుకెళ్లిందనే కేసులో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. శిశువు కిడ్నాప్ కేసులో ఆసుపత్రి నర్సు పాత్ర ఉన్నట్లుగా తెలుస్తోంది.
బురఖా వేసుకున్న మహిళతో కలిసి నర్సే చిన్నారిని ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో అనుమానంగా ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. రెండు రోజులు క్రితం ఆదోని ఆసుపత్రిలో ప్రసవించిన మహిళ పాపను కనిపించకుండాపోయిన ఘటన సంచలన కలిగించింది. ఈకేసును విచారిస్తున్న పోలీసులకు సీసీ టీవీ ఫుటేజ్ లో కూడా బురఖా వేసుకున్న మహిళ కనిపించింది. కానీ క్లియర్ గా దృశ్యాలు కనిపించకపోవటంతో పోలీసులు మరోకోణంలో దర్యాప్తు చేపట్టారు.
రెండురోజుల సస్పెన్స్ అనంతరం పోలీసులు కేసులో నిందితులను పూర్తిగా గుర్తించకపోయినా గానీ..పాపను మాత్రం సురక్షితంగా దక్కించుకుని తల్లికి అందజేశారు. బురఖా వేసుకున్న మహిళే పాపను నర్సు సహాయంతో ఎత్తుకెళ్లినట్లుగా పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. అలా ఎత్తుకెళ్లిన పాపను ఓ దంపతులకు రూ.50 వేలకు అమ్మినట్లుగా తేలింది. పాపను కొనుక్కుకున్న దంపతులు ఓ నర్సు మాకు ఈ బిడ్డను అమ్మిందని చెప్పటంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టగా ముగ్గురు అనుమానుతులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
మందగిరి ప్రాంతంలోని దంపతులకు అమ్మినట్లుగా తెలుసుకున్న పోలీసులు వారి నుంచి పాపను స్వాధీనం చేసుకుని తల్లికి అప్పగించారు. కానీ ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అనే విషయం మాత్రం పూర్తిగా వెల్లడికాలేదు. దీంతో పోలీసులు ఈ కిడ్నాప్ వెనుక ఎవరెవరు ఉన్నారు?ఇంకా ఎంతమంది ఉన్నారు? పాపను కిడ్నాప్ చేయించాల్సి అవసరం ఎవరికి ఉంది? ఓగ్యాంగ్ ఉందా? ఇంకా ఎంతమంది శిశువులను కిడ్నాప్ లు చేసి ఉంటారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీంట్లో భాగంగా ఆదోనితో పాటు మొత్తం జిల్లాను జల్లెడ పడుతున్నారు. సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రంలో కూడా విచారణ కొనసాగిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more