కరోనా వైరస్ మహమ్మారి పీచమణచేలా భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) 2-డీజీ మందును రూపోందించిన విషయం తెలిసిందే. ఇక దీని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ఉత్పత్తి చేయడంతో పాటు మార్కెటింగ్ కూడా చస్తున్న సంస్థ డాక్డర్ రెడ్డీస్ అన్న విషయం కూడా ఇప్పటికే తెలిసిందే. అటు డీఆర్డీఓ తో కలసి సంయుక్తంగా డాక్టర్ రెడ్డీస్ ఫార్మ సంస్థ కూడా ఈ మందును రూపోందించేందుకు తమ వంతు సహాకారాన్ని అందించింది, దీంతో దేశవ్యాప్తంగా ఈ మందును ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే బాధ్యతలను డాక్టర్ రెడ్డీస్ తన భుజాలపై వేసుకుంది. ఈ క్రమంలో ఈ మందుకు ధర ఖరారు చేసింది డాక్డర్ రెడ్డీస్,
మనిషి శరీరంలోకి చేరిన వైరస్ పలు రకాలుగా రూపాంతరం చెందడంతో పాటు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి మనిషి ప్రాణాలను రోజుల వ్యవధిలోనే కబళిస్తోంది. దీంతో అదే స్థాయిలో వైరస్ ను బూరడీ కొట్టించి.. బాధితులను అరోగ్యవంతంగా తీర్చిదిద్దగలడం ఈ 2డిజీ ఔషదం గొప్పతనం. అయితే ఇంతలా బురిడీ కొట్టించి కరోనా వైరస్ బారిన పడిన తొలి, మధ్య ధశలోని బాధితుకు ఇది పూర్తి అరోగ్యవంతులుగా తీర్చిదిద్దగలుతోంది. అయితే ధర ఎంత అంటారా.. ఈ మందు ఒక్కో సాచెట్ ధరను రూ. 990గా నిర్ణయించింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబరెటరీస్. పొడి రూపంలో ఉండే ఈ మందును నీళ్లలో కలుపుకుని తాగడం ద్వారా వైరస్కు అడ్డుకట్ట వేయొచ్చు. త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ మందు ఒక్కో సాచెట్ ధరను రూ. 990గా నిర్ణయించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఆసుపత్రులకు దీనిని రాయితీ ధరల్లో అందించనున్నారు. ఈ మందు తీసుకున్న వారికి ఆక్సిజన్ అవసరం లేకుండా వేగంగా కోలుకుంటారని క్లినికల్ ట్రయల్స్లో తేలింది. అత్యవసర వినియోగానికి ఇప్పటికే దీనికి అనుమతి లభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ సంయుక్తంగా ఉత్పత్తి చేసిన ఈ మందు తొలి బ్యాచ్ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, వైద్యఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఇటీవల అధికారికంగా విడుదల చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more