ఆంధ్రుల అభిమాన నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు 98వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ యుగపురుషుడని, పేదల పాలిట పెన్నిధని బాలయ్య పేర్కొన్నారు. యుగానికి ఒక్కరే మహానుభావులు జన్మిస్తారని.. వారి ప్రస్తావనే ప్రపంచాన్ని ప్రకంపింపజేస్తుందని అన్నారు. మహానుభావుల ఆలోచనలే అనంతమైన ఆనందాన్ని అనుభూతిలోకి కలిగిస్తాయని, వారి విజయగాథలు వేరొక లోకంలోకి వెంట తీసుకెళ్తాయన్నారు.
అలాంటి అరుదైన కోవకి చెందిన మహానుభావుడు ఎన్టీఆర్ అని ఆయన పేర్కొన్నారు. తెలుగు ప్రజలు అన్నా అని ఆర్తిగా పిలుచుకున్నా.. తరాలు మారుతున్నా తరగని కీర్తి ఆర్జించిన ఎన్టీఆర్ కే సాథ్యమైందని నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ పై ఎంతోమంది పుస్తకాలు రాశారని గుర్తు చేసిన బాలకృష్ణ.. ఎన్టీఆర్ జీవిత చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎప్పటి నుంచో కోరుతున్నట్టు చెప్పారు. ఇదే విషయాన్ని మరోమారు డిమాండ్ చేస్తున్నట్టు చెప్పారు. తన తండ్రి సినిమాలు చూసి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు.
'మా గుండెలను మరొక్కసారి తాకి పోండి తాతా..' అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. 'మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..' అంటూ ఎన్టీఆర్ అన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ కు నివాళులు అర్పించి.. ఆయన సేవలను స్మరించుకుంటున్నారు. కాగా, కరోనా కారణంగా ఈసారి ఎన్టీఆర్ ఘాట్కు వెళ్లి నివాళులు అర్పించడానికి రాలేకపోతున్నానని ఎన్టీఆర్ మరో తనయుడు రామకృష్ణ తెలిపారు. అభిమానుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. అందరూ విధిగా కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కోరారు. మన తెలుగు తేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వ కారణమని చిరంజీవి పేర్కొన్నారు. నూరవ జయంతి దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ కు ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారికి దక్కే గౌరవం అని చిరంజీవి అభిప్రాయపడ్డారు. ఆ మహానుభావుడి 98వ జన్మదిన సందర్భంగా స్మరించుకుంటున్నానని చెప్పారు. కాగా, ఎన్టీఆర్ కు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more