కోవిడ్ రోగులతో పాటు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులను ప్రాణాంతకమైన బ్లాక్ ఫంగస్ భయపెడుతోంది. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి బారినపడిన వారిని తాజాగా బ్లాక్ ఫంగస్ వెంటాడుతోంది. అనేక రాష్ట్రాల్లో ఈ తరహా కేసులు ఉత్పన్నమయ్యాయి. అయితే షుగర్ లెవల్స్ సాధారణ స్థాయిలో వుండేలా పర్యవేక్షిస్తే.. బ్లాక్ పంగస్ రాదని ఎయిమ్స్ డైరెర్టర్ రణదీప్ గులేరియా తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నమోదైన బ్లాక్ పంగస్ బాధితులందరిలో సుమారు 90 శాతం మంది మదుమేహ వ్యాధిగ్రస్తులేనని ఆయన తెలిపారు. ఈ తరుణంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
కాగా ఇటు తెలుగు రాష్ట్రాలలోనూ బ్లాక్ ఫంగస్ మెల్లిగా కోరాలు చాస్తోంది. కరోనా నుంచి కోలుకున్నవారిపై తన పంజా విసురుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నమోదవుతున్న కేసులు తెలుగు రాష్ట్రా వైద్యవిభాగం అధికారులలో టెన్షన్ రేకెత్తిస్తున్నాయి. ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ బారిన పడినవారు ప్రాణాలను కోల్పోతున్న క్రమంలో అటు అధికారులు, ఇటు రోగుల బంధవుల్లో అందోళన రేకెత్తుతోంది. తెలంగాణలో అటు అదిలాబాద్, ఇటు హైదరాబాద్ లలో బ్లాక్ పంగస్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో దీని బారిన పడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇక ఏపీలోనూ ముగ్గురు బ్లాక్ పంగస్ కు బలయ్యారు. కరోనా వైరస్ నుంచి ప్రజలను తప్పించే క్రమంలో మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వినియోగించడమే.. బ్లాక్ పంగస్ కు కారణమని వాదనలు వినిపిస్తున్నాయి.
గుజరాత్ లో తొలుత కనిపించిన బ్లాక్ ఫంగస్ ఆతర్వాత ఢిల్లీ, మహారాష్ట్ర, తాజాగా తెలంగాణ, ఏపీలో కూడా పాకింది. ఏపీలో బ్లాక్ ఫంగస్ మరణాలు చోటుచేసుకోవడం కలకలం రేగుతోంది. గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలుకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడితో పాటు మరో యువకుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ మరణించాడు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బ్లాక్ ఫంగస్ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తెలంగాణలోని ఖమ్మం, నిర్మల్ జిల్లాలలో బ్లాక్ ఫంగస్ మరణాలు సంభవించాయి. తెలంగాణలో బ్లాక్ ఫంగస్ కేసులను కోఠి ఈ.ఎన్.టీ ఆస్పత్రి నోడల్ కేంద్రం నుంచి వైద్యాధికారులు పర్యవేక్షిస్తున్నారు. కంటి సమస్య ఉన్నవారికి సరోజనీదేవి కంటి ఆస్పత్రి వైద్యులతో చికిత్స అందిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more