ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, దారుణ విమర్శలు చేస్తూ కించపరుస్తున్నారన్ననేరారోపణలపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్టు చేసిన ఏపీ సీఐడీ పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ మేరకు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో రఘురామను ఏ1గా పేర్కొన్న పోలీసులు, ఆయనతో పాటు ఏ-2 ఏ-3గా రెండు చానల్స్ ను చేర్చారు. రాఘురామకృష్ణ రాజును రాత్రి గుంటూరు సీఐడీ ఆఫీసుకు తరలించిన సిఐడి అధికారులు.. ఆయనను పలు కోణాల్లో విచారించారు. సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ స్వయంగా గుంటూరు ఆఫీసుకి వెళ్లి ఆర్థరాత్రి వరకు అక్కడే వున్నా ఆయన రఘురామను విచారించిన్నట్టు సమాచారం.
ప్రభుత్వాన్ని కించపరిచేలా ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించిన అధికారులు.. కుట్రపూరితంగా ఎందుక వ్యవహరిస్తున్నారని, ఇందుకుగాను ఆయన వెనుకనుండి నడిపిస్తున్నది ఎవరని ప్రశ్నించారు. అయితే సీఐడీ అధికారుల తీరుపై రఘురామకృష్ణరాజు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం తనను కావాలనే కేసులో ఇరికించిందని, తాను చేసిన తప్పేంటో చెప్పాలని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హై సెక్యూరిటీ వింగ్ లో ఉన్న తనను అక్రమంగా అరెస్ట్ చేసినట్లు రఘురామ వాదిస్తున్నారు. ఆయన చేస్తున్న వ్యాఖ్యల సమాచారం, సాంకేతిక సహకారం ఎవరిస్తున్నారని ప్రశ్నలు వేశారు. ఈ విషయాల్లో ఎవరు సహకరిస్తున్నారని ప్రశ్నలను సంధించారని సమాచారం.
ఇవాళ ఉదయం సీఐడీ కార్యాలయంలోనే రఘురామ కృష్ణ రాజుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎంపీకి అవసరమైన మందులు, అల్పాహారాన్ని ఆయన వ్యక్తిగత సిబ్బంది సీఐడీ కార్యాలయంలో అందించారు. హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వాటిని ఎంపీకి అందజేశారు. గుంటూరులోని ప్రాంతీయ కార్యాలయంలో రఘురామకృష్ణరాజును సీఐడీ చేస్తున్న విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వాన్ని అస్థిరపర్చేలా మాట్లాడారంటూ రఘురామరాజుపై రాజద్రోహం(124a) కేసు పెట్టిన సీఐడీ.. ఏ1గా రఘురామకృష్ణరాజు, ఏ2, ఏ3గా ఛానళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. విచారణ పూర్తి అయ్యే వరకు ఎంపీని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more