తెలంగాణ ఫట్టణాభివృది, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు ఇవాళ తనతో సామాజిక మాద్యమం ద్వారా ముచ్చటించారు. ట్విట్టరైట్లు తనను అడిగిన ప్రశ్నలపై ఆయన సౌమ్యంగా సానుకూల ధోరణిలో సమాధానాలు చెప్పారు. కేటీఆర్ ట్విట్టర్ లో (Ask KTR) ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఆసక్తికరంగా సాగింది. ఈ సందర్భంగా నెట్ జనులు పలు అంశాలపై మంత్రివర్యులను ప్రశ్నలు అడిగారు. కాగా ఓ నెటిజన్ లాక్ డౌన్ ను పోడగించనున్నారా అంటూ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... లాక్ డౌన్ పొడిగింపుపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన బదులిచ్చారు.
క్యాబినెట్ భేటీలో తీసుకునే నిర్ణయాలు అప్పటి పరిస్థితులను బట్టి ఉంటాయని చెప్పారు. ఈ నెల 20న క్యాబినెట్ సమావేశం కానుందని వెల్లడించారు. ఇతర అంశాలపై చర్చిస్తూ... రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఏర్పడిందని.. గంటల సమయం కోద్ది ప్రజలు వాక్సీన్ కోసం బారులు తీరుతున్నారని ఓ నెట్ జన్ ప్రశ్నించారు. అయితే ఇందుకు డిమాండ్-సప్లై అంశమే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. కరోనా వాక్సీన్ అధికంగా కేటాయించాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వాని విన్నవించామని అయితే డిమాండ్ కు తగ్గట్టుగా సఫ్లై కాకపోవడంతోనే సమస్య ఉత్పన్నం అవుతోందని కేటార్ అన్నారు. ఇక 70 శాతం ప్రజానీకం వ్యాక్సిన్ పొందితే కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని తెలిపారు.
రాష్ట్రంలోని 2.9 కోట్ల వయోజనుల్లో 1.9 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం రెండు డోసుల వ్యాక్సిన్లు అమల్లో ఉన్నందున ఆ లెక్కన 3.8 కోట్ల డోసులు అవసరం అవుతాయని కేటీఆర్ వివరించారు. మరో ప్రశ్నకు బదులిస్తూ, అమెరికా వ్యాక్సిన్లకు భారత్ లో అనుమతి లేదని, ఒకవేళ అనుమతి వస్తే తప్పకుండా వాటిని సేకరిస్తామని వెల్లడించారు. రాష్ట్ర జనాభాకు తగినన్ని డోసులు వస్తే మాత్రం 45 రోజుల్లో తెలంగాణలో ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ ఇస్తామని, ఆ మేరకు సమర్థత, మౌలిక సదుపాయాలు రాష్ట్రానికి ఉన్నాయని కేటీఆర్ స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more