తెలంగాణలో కరోనా వైరస్ విజృంభన అంతకంతకూ పెరుగుతోంది. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా లభించని స్థితి నెలకొంది. అయినా ప్రజల్లో మాత్రం ఎలాంటి అప్రమత్తత లేదెు. మాస్కులు వేసుకోకుండానే ఇప్పటికీ అనేక మంది రోడ్డపైకి వస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా కరోనా విషయంలో ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వినవస్తున్నాయి. ఇప్పటికే అసుపత్రుల్లో బెడ్లు లభించక అనేక మంది అసుపత్రుల భయటే పడిగాపులు కాస్తున్నారు. అసుపత్రుల్లో చేరిన వారికి ఆక్సిజన్, ఔషదాలు కూడా లభించక అనేక ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు.
ఇక సత్వహాగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి వెంటిలేటర్ చాలా అవసరం. ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలో అందుబాటులో ఉన్న ఒక్కో వెంటిలేటర్ కోసం పోటీ బాగా పెరిగింది. ఒక్కో వెంటిలేటర్ కోసం దాదాపు 15 నుంచి 20 మంది పోటీపడుతున్నారు. ఇక వెంటిలేటర్ సాయం తీసుకున్న రోగులు ఒక్కక్కరూ పది నుంచి పక్షం రోజుల పాటు దాని సాయంతోనే సాధారణ స్థితికి చేరుకుంటున్నారు. దీంతో ఒక్కో వెంటిలేటర్ కొత్త రోగులకు అందుబాటులోకి రావడానికి పది రోజుల నుంచి పక్షం రోజుల సమయం పడుతోంది. దీంతో వెంటిలేటర్లకు విపరీతమైన డిమాండ్ నెలకొంది.
ఇలాంటి పరిస్థితుల్లో నగరంలోని ఓ బడా వ్యాపారి కుమారుడికి కరోనా సోకింది. అతడి పరిస్థితి విషమంగా వుండటంతో వెంటిలేటర్ అత్యవసరమైంది. అందుకోసం అతను కార్పోరేట్ ఆసుపత్రులకు ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు. తన కొడుకు ప్రాణాలు కాపాడితే రూ. 50 లక్షలు ఇస్తానని.. తన డబ్బుకు బిల్లు కూడా అవసరం లేదని చెప్పాడు. ఇక ఇంత పెద్ద మొత్తం ఎక్కువని భావిస్తే, మిగిలే డబ్బులతో పేదలకు కరోనా వైద్యం చేయాలని సూచించాడు. అయితే ఇంతటి ఆఫర్ ఇచ్చినా సదరు వ్యాపారి తనయుడికి వెంటిలేటర్ ఏకంగా 24 గంటల వ్యవధి తరువాతే లభించింది. నగరంలో ప్రస్తుతం నెలకోన్న పరస్థితిని ప్రజల దృష్టికి తీసుకువచ్చేందుకే ఈ ఘటనను ప్రస్తావించాల్సి వస్తోంది. హైదరాబాద్ లో ప్రాణాలు నిలిపే వెంటిలేటర్ లకు ఎండ డిమాండ్ ఉందన్న విషయం.
ఇక ఇతర జిల్లాల నుంచి వస్తున్న వారికి తాత్కాలికంగా వెంటిలేటర్ బెడ్లకు బదులుగా ఆక్సిజన్ బెడ్లు ఇస్తామని, రెండు మూడు రోజుల తరువాత ఖాళీ అయితే, వెంటిలేటర్ బెడ్లు ఇస్తామని, ఈలోగా ప్రాణాలు పోతే తమకు సంబంధం లేదని ప్రైవేటు ఆసుపత్రి వర్గాలు ఖరాఖండీగా చెబుతున్నాయి. వెంటిలేటర్ల కోసం ఇంతగా డిమాండ్ పెరగడం ఇంతవరకూ ఎన్నడూ చూడలేదని వైద్యులే చెబుతుండటం గమనార్హం. ఇక లక్షణాలు లేకుండా, స్వల్ప లక్షణాలతో ఉన్న వారు వైద్యుల సలహాలను తీసుకోకుండానే ఇంట్లో చికిత్సలు తీసుకుంటూ హోమ్ ఐసొలేషన్ కు పరిమితం అవుతున్నారని, వారిలో పరిస్థితి విషమించడంతోనే వెంటిలేటర్ బెడ్లకు డిమాండ్ పెరుగుతోందని వైద్యులు అంటున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి ఎంతగా విషమించిందంటే, ఎవరైనా కోలుకుంటేనో, లేదంటే చనిపోతేనో మాత్రమే వెంటిలేటర్ బెడ్ ఖాళీ అవుతోంది. ఈ చికిత్సలో కనీసం రోజుకు 20 లీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుంది. బాధితుడు తనంతట తానుగా ఊపిరి పీల్చుకునే వరకూ చికిత్స అవసరం ఉంటుంది. ఇదే సమయంలో నాలుగు ఆక్సిజన్ బెడ్లపై ఉన్న రోగులకు ఒక నర్స్ అవసరం కాగా, వెంటిలేటర్ బెడ్ పై ఉన్న రోగి సహాయార్థం ఒక నర్సును నియమించడం తప్పనిసరని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి కరోనా బారిన పడకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వైద్యులు, ప్రభుత్వం కోరుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more