మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్ భూములను మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కబ్జా చేశారన్న అరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ అరోపణలపై అధికారుల విచారణ చేసి నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వెనువెంటనే మంత్రి పదవిని తన కిందకు తీసుకున్న తరువాత ఈటెలను పదవి నుంచి ఉద్వాసన కూడా పలికిన పరిణామాలు కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో చట్టప్రకారం తన భూముల్లో అసైన్డ్ భూములు ఉంటే దానిని విచారించాల్సిన పద్దతి ఇది కాదని, తనతో పాటు తన ఇరుగుపోరుగు రైతులను కూడా పిలచి పంచుల సమక్షంలో జిల్లా ఈడీ అధికారులు సర్వే చేస్తారని.. రెండు రోజుల క్రితం జరిపిన భూముల సర్వే పారదర్శకంగా జరగలేదని ఈటల అంటున్నారు.
భారీ పోలీసు బలగాల మోహరింపు మధ్య అధికారులు విచారణ జరపడమేమిటని ఈటెల ప్రశ్నించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్ కుటుంబం రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టును ఆశ్రయించారు. తమ భూముల్లో చట్ట విరుద్ధంగా సర్వే చేశారని పేర్కొంటూ ఈటల రాజేందర్ భార్య, కుమారుడు, జమునా హేచరీస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పుల తడకగా ఉందని చెప్పారు. తమకు ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా హేచరీస్లోకి వెళ్లి విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అచ్చంపేటలోని తమకు సంబంధించిన భూముల్లో అక్రమంగా ప్రవేశించి, సర్వే చేసి బోర్డులను పెట్టారని కోర్టుకు తెలిపారు. తమ భూముల్లో జోక్యం చేసుకోకుండా ఆదేశించాలని హైకోర్టును కోరారు.
ఈటెల కుటుంబసభ్యులు దాఖలు చేసిన అత్యవసర పిటీషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ ప్రసాద్ వాదనలు వినిపించగా, హైకోర్టు పలు ప్రశ్నలను ఆయనకు సంధించింది. అరోపణలు వచ్చినా.. రాకున్నా.. సర్వే చేస్తున్నప్పుడు సదరు భూ యజమానులకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయిందని అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. అంతకుముందు ఈటెల తరపు న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వలేదని, తమ భూముల్లోకి అధికారులు అక్రమంగా చోరబడ్డారని, కలెక్టర్ నివేదికను కూడా ఇవ్వలేదని చెప్పారు.
ఈటెలపై తీవ్రమైన అరోపణలు రావడంతోనే విచారణ జరుపుతున్నామని అడ్వకేట్ జనరల్ సమాధానమివ్వగా న్యాయస్థానం ప్రశ్నలను సంధించింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా? అని ప్రశ్నించింది. అధికారులు రూపొందించిన నివేదికపై పలు అభ్యంతరాలు తెలిపింది. అయితే, ఈటల భూములపై ప్రాథమిక విచారణ మాత్రమే చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. ఈ విషయంపై తదుపరి చర్యలు చట్ట ప్రకారమే ఉంటాయని కలెక్టర్ నివేదికలో తెలిపారని అన్నారు. పిటిషన్పై విచారణ కొనసాగుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more