తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరో 57 గంటల వ్యవధిలో ప్రచారానికి బ్రేక్ పడుతున్నందన్న సమయంలో తెరపడుతున్న తరుణంలో రాష్ట్రంలో ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు కొనసాగాయి. ప్రతిపక్ష డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అల్లుడు, డీఎంకే పార్టీ అడ్వైజర్ల బృందంలో ఒకడైన శబరీశన్ నివాసంలో ఆదాయ పన్నుశాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. చెన్నై నగరం వెలుపల వున్న నీలంగరాయ్ లోని శబరీశన్ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన మరో మూడు కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి ఏకకాలంలో తనిఖీలు జరుగుతున్నాయి. స్టాలిన్ కుమార్తె సెంతమరయ్ భర్త శబరీశన్.
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇలా దాడులు జరగడం పరిపాటే. ఒక ఎన్నికలకు ఒక్క రోజు ముందు ఎన్నికలు రద్దు కావడం కూడా తమిళనాడు ప్రజలు వీక్షించారు. జయలలిత ప్రాతినిథ్యం వహించిన అర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈ తంతు జరిగింది. విపరీతమైన ధన ప్రవాహం నడుస్తుందని ఎన్నికలను నిలిపేసినా.. ప్రజలిచ్చే ఫలితాన్ని మాత్రం వాయిదా పడిన ఎన్నికలలోనూ మార్చలేకపోయారు. ఇక ఈ సారి శాసనసభ ఎన్నికలకు ముందు డీఎంకే నేతలపై ఐటీ దాడులు జరగడం ఇది రెండోసారి. గత నెల ఆ పార్టీ సీనియర్ నేత ఈవీ వేలు నివాసంలో ఆదాయ పన్ను అధికారులు సోదాలు చేశారు. ఎన్నికల కోసం భారీగా నగదు ప్రవాహం జరగుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఆ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఈ నేపత్ంయలో ఐటీ దాడులు ముగిసిన తరువాత డీఎంకే అధినేత స్టాలిన్ తన పేరు ఎంకే స్టాలిన్ అని.. తాను కళైంజ్ఞర్ (‘కరుణానిధి) తనయుడినని అన్నారు. తన పేరును ఐటీ అధికారులు గుర్తుంచుకోవాలని అన్నారు. తాను ఎమర్జెన్సీతో పాటు మీసాలను కూడా ఎదుర్కోన్నానని అన్నారు. ఇలాంటి దాడులకు బెదిరిపోయి.. మోకరిల్లేందుకు తాను అన్నాడీఎంకే నాయకుడిని కాదని.. ప్రధాని నరేంద్రమోడీ గ్రహించాలని అన్నారు. కాగా నిన్న స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్.. తన నియోజకవర్గంలోని ఓ సభలో మా్ట్లాడుతూ అక్రమంగా ఆదాయన్ని పెంచుకున్న అమిత్ షా తనయుడు జైషా గురించి ప్రశ్నించగానే మరుసటి రోజునే ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఈ సందర్ంఘా ఆయన మాట్లాడుతూ.. తన సోదరి ఇంటిపై కాకుండా తన ఇంటిపై సోదాలు నిర్వహించాల్సిందిగా సవాల్ విసిరాడు.
తమిళనాడులో మొత్తం 234 శాసనసభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 6న ఓకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో 2011 నుంచి అధికారానికి దూరంగా ఉంటోన్న డీఎంకే.. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉంది. కాంగ్రెస్, వాపక్షాలు, ఎండీఎంకే, వీసీకే వంటి పార్టీలతో పొత్తు పెట్టుకుని గట్టిగా ప్రచారం చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం 234 అసెంబ్లీ స్థానాలుండగా.. సీట్ల సర్దుబాటులో భాగంగా డీఎంకే 173 స్థానాల్లో బరిలోకి దిగుతోంది. స్టాలిన్ ఎప్పటిలాగే కొలతూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా.. ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి ప్రత్యక్ష ఎన్నికల పోరులోకి అరంగేట్రం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more