ప్రచండ భానుడి ఉగ్రరూపానికి నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న క్రమంలో ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో ఏ ఏడుకాయేడు పెరుగుతూ పోతున్నాయి. దీంతో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రతతో భానుడు ప్రస్తుతం ఉగ్రరూపం దాలుస్తూ నగరవాసులపై ఉరుముతున్నాడు. నగరంలో మార్చి మాసాంతంలోనే ఏకంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ణ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయంటే ఇక రానురాను పరిస్థితులు ఎంత తీవ్రంగా వుండబోతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
హైదరాబాద్ మాత్రమే కాకుండా ఏకంగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం ఈ సీజన్ లోనే అత్యధికంగా ఉండబోతుందన్న దానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇటు హైదరాబాద్ లోనూ క్రితంరోజున భానుడు భగభగలు సాధారణస్థాయికి మించి వున్నాయి. ఖైరతాబాద్ లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-25.9 డిగ్రీలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.
ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండల తీవ్రతకు నగరవాసులు బెంబేలెత్తున్నారు. పొట్టకూటి కోసం అనేక మంది రోజంతా ఎండలో తిరగాల్సి వస్తుంది. ఈ క్రమంలో అక్కడక్కడా చలివేంద్రాలే తప్ప.. ఎండ తీవ్రత నేపథ్యంలో సల్ల (మజ్జిగ) అంబలి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుండేదన్న నగరవాసలు భావిస్తున్నారు. ప్రభుత్వం చేయని పక్షంలో కనీసం జీహెచ్ఎంసీ అయినా ఈ మేరకు చోరవ తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వాహనదారులు, ప్రయాణికులు, వృద్ధులు, పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more