Hyderabadis experiencing high temperatures in March మార్చిలోనే నగరవాసులు మాడు పగులగొడుతున్న భానుడు..

Hyderabadis experiencing high temperatures in the begining of summer

India Meteorological Department, heat wave, weather-report, warning, summer, heatwave in Hyderabad, hear in telangana, Telangana, Delhi

Hyderabadis are experiancing the more than common temperature this summer. The Indian Meteorological Department (IMD) has said the heat recorded at Khairathabad yesterday wa nearly 40 degrees celsius.

మార్చిలోనే నగరవాసులు మాడు పగులగొడుతున్న భానుడు..

Posted: 03/30/2021 12:01 PM IST
Hyderabadis experiencing high temperatures in the begining of summer

ప్రచండ భానుడి ఉగ్రరూపానికి నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. నగరంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో నగరవాసులు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జంకుతున్నారు. నగరం మొత్తం కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న క్రమంలో ఉష్ణోగ్రతలు కూడా అదే స్థాయిలో ఏ ఏడుకాయేడు పెరుగుతూ పోతున్నాయి. దీంతో ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతల తీవ్రతతో భానుడు ప్రస్తుతం ఉగ్రరూపం దాలుస్తూ నగరవాసులపై ఉరుముతున్నాడు. నగరంలో మార్చి మాసాంతంలోనే ఏకంగా 40 డిగ్రీలకు పైగా గరిష్ణ ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయంటే ఇక రానురాను పరిస్థితులు ఎంత తీవ్రంగా వుండబోతున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

హైదరాబాద్ మాత్రమే కాకుండా ఏకంగా తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం ఈ సీజన్ లోనే అత్యధికంగా ఉండబోతుందన్న దానికి సంకేతాలు ఇప్పుడే అందుతున్నాయి. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బనలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.8 నుంచి 42.7 డిగ్రీలుగా నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇటు హైదరాబాద్ లోనూ క్రితంరోజున భానుడు భగభగలు సాధారణస్థాయికి మించి వున్నాయి. ఖైరతాబాద్ లో 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సగటు కనిష్ఠ ఉష్ణోగ్రతలు 18-25.9 డిగ్రీలుగా నమోదైనట్టు అధికారులు తెలిపారు.

ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులపాటు సాధారణం కంటే 2-3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అదనంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎండల తీవ్రతకు నగరవాసులు బెంబేలెత్తున్నారు. పొట్టకూటి కోసం అనేక మంది రోజంతా ఎండలో తిరగాల్సి వస్తుంది. ఈ క్రమంలో అక్కడక్కడా చలివేంద్రాలే తప్ప.. ఎండ తీవ్రత నేపథ్యంలో సల్ల (మజ్జిగ) అంబలి కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే బాగుండేదన్న నగరవాసలు భావిస్తున్నారు. ప్రభుత్వం చేయని పక్షంలో కనీసం జీహెచ్ఎంసీ అయినా ఈ మేరకు చోరవ తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలతో వాహనదారులు, ప్రయాణికులు, వృద్ధులు, పిల్లలు విలవిల్లాడుతున్నారు. ఇంటి నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles