సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అసంబ్లీ ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ భైఠాయించారు. సంగారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో వైద్యకళాశాలను ఏర్పాటు చేయాలని, నియోజకవర్గ అభివృద్దికి వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని 40 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాలను కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తూ ఇవాళ నిరసన బాట పట్టారు. ఈ మేరకు రాసివున్న ప్లకార్డులతో అసెంబ్లీలోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. మార్షల్స్ అడ్డుకోవడంతో అక్కడే బైఠాయించారు. అంతకుముందు ఆయన తన తనయ జయారెడ్డితో కలసి లోయర్ ట్యాంక్ బండ్ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు.
అంతకుముందు ఆయన ఇవాళ ఉదయం లోయర్ ట్యాంక్ బండ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద తన తనయ జయారెడ్డితో కలసి అక్కడ నిరసన వ్యక్తం చేశారు. ఆ తరువాత అక్కడి నుంచి ఆయన అసెంబ్లీ వరకు తన తనయతో కలసి పాదయాత్రగా చేరుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలకు సమయం ఇవ్వడం లేదని, అందుకు నిరసన తెలుపుతూ ట్యాంక్ బండ్ నుంచి పాదయాత్రగా వచ్చానని చెప్పారు జగ్గారెడ్డి. ప్రభుత్వం హామీలు అమలు చేయాలని ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీకి వెళ్లారు. అలాగే లోనికి కూడా వెళ్లే ప్రయత్నం చేయగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ప్లకార్డులు ఉంటేనే లోనికి వెళ్తానని గేటు దగ్గరే బైఠాయించారు జగ్గారెడ్డి.
ఈ సందర్భంగా గన్ పార్క్ లోని మీడియాపాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో తమ వాణి వినిపించే అవకాశం రాకపోవడంతో తాను ఈ నిరసనకు దిగానని చెప్పారు. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే దానిని సిద్దిపేటకు తరలించారని ఆయన అరోపించారు. 2013లో 5 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తే.. ఆ తరువాత 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం వారిని ఖాళీ చేయించిందని అన్నారు. నియోజకవర్గంలోని 40 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలను పరిష్కరించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more