మహమ్మారి కరోనా వైరస్ సెకండ్ వేవ్ ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తోంది. ప్రపంచదేశాలతో పాటు పాకిస్తాన్ లోనూ కోరలు చాస్తోంది. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ తాజాగా కరోనా బారిన పడ్డారు. ఆయనను పరీక్షీంచిన వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని తేల్చారు. అదెలా సాధ్యం.. కరోనా టీకా తీసుకున్న వ్యక్తులు కరోనాను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వుంటుంది కదా.? మరి ఇమ్రాన్ ఖాన్ కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు కదా.? మరి ఆయనకు కరోనా ఎలా సోకింది. ఆయన కరోనా బారిన పటడానికి కారణలేంటి.? అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది.
పాకిస్థాన్ ప్రధానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆయన తీసుకున్న కరోనా టీకా గురించి ఆరా తీస్తున్నవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆయన ఏ వాక్సీన్ తీసుకున్నారన్న విషయం తెలిస్తే తాము ఆ వాక్సీన్ కు దూరంగా వుండవచ్చునన్న యోచనలో ఇప్పుడు యావత్ ప్రపంచం ఉందంటే అతిశయోక్తి కాదు. ఇక టీకా తీసుకున్న తర్వాత పాజిటివ్ రావడం విస్మయం కలిగిస్తున్నా.. ఆయన ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారన్న విషయంపై కూడా చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ అంశం పాకిస్తాన్ లో కలకలం రేపుతోంది. ఇమ్రాన్ ఖాన్ కు కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యిందని పాక్ వైద్య శాఖ మంత్రి ఫైజల్ సుల్తాన్ ప్రకటించారు.
ఇంట్లోనే స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు అని సుల్తాన్ తెలిపారు.అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజులకే ఆయనకు పాజిటివ్ రేపడం ఆందోళన కలిగిస్తోంది. అయితే చైనాకు సంబంధించిన వ్యాక్సిన్ ‘సినోవక్’ వ్యాక్సిన్ తొలి డోసు ఇమ్రాన్ఖాన్ తీసుకున్నారు. ప్రజలందరూ కూడా వ్యాక్సిన్ పొందాలని సూచించారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా అధికారికంగా తెలిపింది. అయితే పాకిస్తాన్ ప్రధానికి పాజిటివ్ రావడం.. చైనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం కరోనా సోకడంతో సోషల్ మీడియాలో ఫన్నీగా కామెంట్లు వస్తున్నాయి. చైనా వస్తువుల మాదిరి వ్యాక్సిన్ కూడా నాసిరకం అని కామెంట్స్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more