ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయదుంధఃభి మ్రోగించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఆ వెంటనే వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయఢంకా మ్రోగించింది. అదేంటి గడిచిన విషయాలను మళ్లీ చెబుతున్నారెందుకు అనుకుంటున్నారా.? ఈ ఎన్నికలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు బ్యాలెట్ బాక్సుల్లో వారి అభిప్రాయాలను కూడా ప్రభత్వం దృష్టికి తీసుకువచ్చారు. అసెంబ్లీ రౌడీ చిత్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్లు తమ ఆకాంక్షలను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చారు.
తమ విన్నపాలు ముఖ్యమంత్రి వెఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెరుతాయని, లేని పక్షంలో మీడియా తమ విన్నపాలను ఆయన దృష్టికి తీసుకెళ్లేలా చేస్తోందని వీరు బలంగా భావించి ఈ చర్యలకు పాల్పడ్డారు. ఇంతకీ ఓటర్ల అకాంక్షలు ఏమిటన్న వివరాల్లోకి వెళ్తే.. విశాఖలో..విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ తమ అకాంక్షను వ్యక్తంచేశారు. అక్కడి ప్రజలు. ఇలా రాసివున స్లిప్పులను విశాఖ నగరపాలక సంస్థ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బ్యాక్సుల్లో ఓెటర్లు వేశారు. తద్వారా తమ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ చేయవద్దని కార్మికులు తమ డిమాండ్ ను మరోమారు కూడా పునరుద్ఘాటించారు.
ఇక తాజాగా కర్నూలు జిల్లా నంద్యాలలోనూ ఇలాంటి స్లిప్పులు ఎన్నికల అధికారులను విస్తుపోయేలా చేశాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా నంద్యాల 29వ వార్డు బ్యాలెట్ బాక్సులను తెరిచిన సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. నంద్యాల తాగుబోతుల విన్నపం అంటూ ఆ చీటీల్లో ముద్రించి ఉన్న సందేశం వారిని విస్మయానికి గురిచేసింది. ఏపీలో కొత్త మద్యం బ్రాండ్లను తొలగించాలని, పాత మద్యం బ్రాండ్లను మళ్లీ తీసుకురావాలని ఆ స్లిప్పుల్లో పేర్కొన్నారు. సుప్రీం, జంబో, హైదరాబాద్, దారు వంటి నూతన బ్రాండ్లు తమకు వద్దని... రాయల్ స్టాగ్, బ్లాక్ డాగ్, ఇంపిరీయల్ బ్లూ వంటి పాత బ్రాండ్లు మళ్లీ తీసుకురావాలని కోరారు. తాము కోరిన పాత బ్రాండ్లు అమ్మకపోతే ఇదే తమ చివరి ఓటు అవుతుందంటూ సీఎంను ఉద్దేశించి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more