కరోనా కష్టకాలం పేద, మధ్య తరగతి ప్రజలను మరీ ముఖ్యంగా రెక్కాడితే కానీ డొక్కాడని జీవితాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఇక చిరు వ్యాపారుల కుటుంబాల ఆర్థిక పరిస్థితుల్ని మరింత దిగజార్చింది. ఈ క్రమంలో అన్ లాక్ తరువాత కూడా అంతకంతకూ పెరుగుతున్న ధరలతో ఈ వర్గాల పరిస్థితి పెనం మీద నుంచి పోయిలో పడేలా చేసింది. అయితే ఈ గృహిణిని ఆశలను మాత్రం అనుకున్న దానికన్నా మరింత ఎక్కువగానే మార్చేంది. ఏకంగా ఈమె ఇంటిని లక్ష్మీదేవి తలుపుతట్టి.. రాత్రికి రాత్రి లక్షాధికారిణి చేసింది.
అదెలా సాధ్యం.. అంటారా.. అమె అనుకోకుండా కొన్న లాటరీ టిక్కెట్ కు కోటి రూపాయల ప్రథమ బహుమతి లభించింది. ఔనా.. ఇంతకీ ఆ టిక్కెట్ ధర ఎంత అంటారా.? కేవలం వంద రూపాయలే. దీంతో అమె కుటుంబంలో కష్టాలు తీరి సుఖసంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. సంబరాలు చేసుకుంటున్నారు. సాధరణంగా ఈ తరహా లాటరీ బహుమతుల్లో కేరళ రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఈ సారి పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో ఓ సాధారణ మధ్యతరగతి గృహిణికి ఈ లాటరీ టిక్కెట్ బహుమతి వరించడం చర్చనీయాంశంగా మారింది.
అమృత్ సర్ కు చెందిన రేణూ చౌహాన్ సాధారణ మధ్యతరగతి గృహిణి. అయితే తన భర్త మాత్రం చిన్న వస్త్రాల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. తన భర్తకు మధ్యాహ్నం బోజనం తీసుకెళ్తూ ఓ రోజున అమె కంట పడిన లాటరీ టిక్కెట్ ను వంద రూపాయలు పెట్టి కొనింది. అంతే అమె ఇంటిని అదృష్టం తలుపుతట్టి ఏకంగా ప్రథమ బహుమతిగా కోటి రూపాయలను అందుకోనుంది. ఆ లాటరీకి సంబంధించిన డ్రాను అధికారులు ఫిబ్రవరి 11న తీశారు. ఆ డ్రాలో రేణూ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ D-12228కు మొదటి బహుమతి తగిలింది.
దీంతో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రేణూ చౌహాన్ను విజేతగా ప్రకటించింది. ప్రైజ్ మనీ పొందేందుకు కావాల్సిన డాక్యుమెంట్లను రాష్ట్ర లాటరీస్ శాఖలో రేణూ గురువారం సమర్పించింది. త్వరలోనే ఆమెకు కోటి రూపాయల నగదు చేరుతుందని రాష్ట్ర లాటరీ శాఖ అధికారి వెల్లడించారు. ఈ సందర్భంగా రేణూ చౌహాన్ కుటుంబం సంతోషంలో మునిగితేలుతోంది. లాటరీ డాక్యుమెంట్లను సమర్పించిన అనంతరం రేణూ చౌహాన్ మాట్లాడుతూ.. భగవంతుడి ఆశీస్సులతోనే తనకు లాటరీ తగిలిందని ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబం సంతోషంగా జీవించేందుకు ఈ నగదు ఎంతో ఉపయోగపడుతుందని ఆమె వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more