పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ)లోని ప్రజల ధనంతో ఆర్థిక నేరానికి పాల్పడి.. దేశం నుంచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూనైటెడ్ కింగ్ డమ్ లోని లండన్ కోర్టు షాకిచ్చింది. గత రెండున్నరేళ్లుగా భారత్ కు తిరిగి రాకుండా ఉండేందుకు నీరవ్ మోడీ చేసిన ప్రయత్నాలన్నింటికీ అక్కడి వెస్ట్ మినిస్టర్ న్యాయస్థానం అడ్డుపుల్ల వేసింది. నిధుల మళ్లింపు అభియోగాలు రుజువైన నేపథ్యంలో అతనికి శిక్ష ఖరారు అవుతుందని, ఈ నేపథ్యంలో ఆయనను భారత దేశానికి అప్పగించాలని మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి సామ్యూల్ గూజీ అదేశించారు.
భారత్ లో తనకు న్యాయం జరగదని ఆయన ఇన్నాళ్లు చేసిన వాదనలను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఇక తన మానసిక స్థితి సరిగా లేదంటూ నీరవ్ చేసిన వాదనలను కోర్టు తప్పబట్టింది. భారత్ కు అప్పగించినంత మాత్రన అన్యాయం జరగదని న్యాయస్థానం పేర్కొంది. నిధుల మళ్లింపు విషయంలో భారత్ సమర్పించిన ఆధారాల రుజవు అయ్యాయని, ఈ ఆధారాలు ఆయనకు శిక్ష ఖరారు చేసేందుకు కూడా సరిపోతాయని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ క్రమంలో ఆయనను తన దేశానికి అప్పగించాలని తీర్పు వెలువరించింది.
కాగా నిరవ్ మోడీకి చివరకు ఒక చిన్న ఆశను కల్పించింది. తమ ఉత్తర్వులపై అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో నీరవ్ మోడీ మరికొన్ని రోజుల పాటు భారత్ కు రాకుండా అక్కడి ఉన్నత న్యాయస్థానాల్లో అపీలు చేసుకునే వెసలుబాటు లభించింది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది. నిరవ్ మోడీ చట్టబద్ధంగా వ్యాపారం చేశారనడాన్ని తాను నమ్మడం లేదని, లావాదేవీల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని తాను విశ్వసిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు.
తప్పుడు ఎల్వోయూలతో పీఎన్బీని నీరవ్ మోసగించిన వైనం 2018 జనవరి వెలుగుచూడగా.. సీబీఐ ఈ కేసు దర్యాప్తును ప్రారంభించింది. అదే ఏడాది ఈడీ సైతం రంగంలోకి దిగి నీరవ్కు చెందిన పలు ఆస్తులను స్వాధీనం చేసుకుంది. 2018 డిసెంబర్లో నీరవ్ తమ దేశంలోనే నివసిస్తున్నాడని బ్రిటన్ భారత్కు తెలియజేసింది. దీంతో అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. ఈ క్రమంలో 2019 మార్చిలో నీరవ్ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అక్కడి వాండ్స్వర్త్ జైల్లో నీరవ్ ఉంటున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కోర్టు తిరస్కరిస్తూ వచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more