కేంద్రపరిపాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోమారు ఘాతుకానికి తెగబడ్డారు. బఘాట్ ప్రాంతంలో నిరాయుధులైన పోలిసులపై తీవ్రవాదులు కాల్పులు జరిపి క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. అసలేం జరుగుతుందో కూడా తలియని జనాలు తుపాకీ కాల్పుల శబ్దాలు విని తేరుకుని చూసే లోపు కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుస్తుల్లో తుపాకీని దాచుకుని వచ్చిన ముష్కరుడు.. పోలీసుల వద్దకు వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరపాడు.
ఈ కాల్పుల్లో జుర్హమా కుప్వారాకు చెందిన కానిస్టేబుల్ మహమ్మద్ యూసుఫ్, లోగ్రిపోరా ఐష్ముకంకు చెందిన కానిస్టేబు్ సుహేల్ అహ్మద్ లను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మహమ్మద్ యూసుప్ ఘటనాస్థలంలోనే మరణించగా, సుహేల్ అహ్మద్ మాత్రం అసుపత్రికి తరలించిన చికిత్స కొనసాగుతుండగా మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాదిని పట్టుకునేందుకు ఇద్దరు యువకులు సిద్దం కాగా, అదే సమయంలో అటుగా వచ్చిన మారుతి కారును చూసి ఉగ్రవాది అందోళనకు గురై పారిపోయాడు. ఇదే క్రమంలో తమపై కూడా తూటాలను వదులుతాడని భావించిన యువకులు వెనుదిరిగారు.
అదే అదనుగా భావించిన ముష్కరుడు క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి మొత్తాన్నితమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీలో లభించిన ఫూటేజీని పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఈ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ఉగ్రవాది కాల్పులకు తెగబటడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. దుండగుడి కోసం పోలీసులు అన్వేషణ సాగుతోంది. ముష్కరుడు అధిక దూరం వెళ్లే అవకాశం లేదని.. భావిస్తున్న పోలీసులు గాలింపు చర్యలు తీవ్రం చేశారు.
నిరాయుధులైన కానిస్టేబుళ్లను వెనుక నుంచి, దొంగరీతిలో దాడులు చేసి హతమార్చడం పట్ల వీరమరణం పోందిన కానిస్టేబుళ్లు మహమ్మద్ యూసుప్,సుహేల్ అహ్మద్ లకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నమాని జమ్ముకాశ్మీర్ పోలీసు విభాగం ట్విట్టర్ లో పోస్టు చేసింది. వీరుల కుటుంబాలకు తాము నిత్యం అందుబాటులో వుంటామని, ముఖ్యంగా ఈ విషాద సమయంలో వారికి అండగా నిలుస్తామని తెలిపింది. ఇక కానిస్టేబుళ్లను హతమార్చడం పట్ల పిడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
24 దేశాలకు చెందిన దౌత్యాధికారులు ఇవాళ ఉదయం కాశ్మీర్ కు చెరుకున్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. రెండు రోజుల పాటు వివిధ దేశాల దౌత్యాధికారులు జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇక గత మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. అత్యంత భద్రత ఉండే దుర్గనాగ్ ప్రాంతంలోని కృష్ణా రెస్టారెంట్ ఓనర్ కుమారుడిపై రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు కాల్పులు జరిపి హతమార్చిన ఘటన మరువక ముందే ఇవాళ ఇద్దరు కానిస్టేబుళ్లను ఉగ్రవాదులు హతమాచ్చడం గమనార్హం.
#WATCH Terrorist opens fire in Baghat Barzulla of Srinagar district in Kashmir today
— ANI (@ANI) February 19, 2021
( CCTV footage from police sources) pic.twitter.com/FXYCvQkyAb
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more