Two cops killed as terrorists open fire in J-K's Srinagar నిరాయుధులైన పోలీసులపై ఉగ్రవాది కాల్పులు..

Unidentified people fire bullets at security forces in srinagar two policemen dead

jammu and kashmir terror attack, jammu and kashmir cops killed, cops killed in terror attack, Terrorist, Gun shot, Two Policemen, CCTV footage, Barzulla area, Srinagar, Omar Abdullah, Mehbooba Mufti, Barzulla area, Srinagar, Jammu and Kashmir

Two policemen died after being shot at by terrorists in Barzulla area of the Srinagar district in Jammu and Kashmir on Friday, officials said. The area was cordoned off following the attack at the police party and a hunt was on to nab the attackers after the force found CCTV footage of the terrorists.

ITEMVIDEOS: నిరాయుధులైన పోలీసులపై ఉగ్రవాది కాల్పులు..

Posted: 02/19/2021 04:30 PM IST
Unidentified people fire bullets at security forces in srinagar two policemen dead

కేంద్రపరిపాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోమారు ఘాతుకానికి తెగబడ్డారు. బఘాట్ ప్రాంతంలో నిరాయుధులైన పోలిసులపై తీవ్రవాదులు కాల్పులు జరిపి క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. అసలేం జరుగుతుందో కూడా తలియని జనాలు తుపాకీ కాల్పుల శబ్దాలు విని తేరుకుని చూసే లోపు కాల్పులలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. దుస్తుల్లో తుపాకీని దాచుకుని వచ్చిన ముష్కరుడు.. పోలీసుల వద్దకు వచ్చి అతి సమీపం నుంచి కాల్పులు జరపాడు.

ఈ కాల్పుల్లో జుర్హమా కుప్వారాకు చెందిన కానిస్టేబుల్ మహమ్మద్ యూసుఫ్, లోగ్రిపోరా ఐష్ముకంకు చెందిన కానిస్టేబు్ సుహేల్ అహ్మద్ లను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, మహమ్మద్ యూసుప్ ఘటనాస్థలంలోనే మరణించగా, సుహేల్ అహ్మద్ మాత్రం అసుపత్రికి తరలించిన చికిత్స కొనసాగుతుండగా మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో ఉగ్రవాదిని పట్టుకునేందుకు ఇద్దరు యువకులు సిద్దం కాగా, అదే సమయంలో అటుగా వచ్చిన మారుతి కారును చూసి ఉగ్రవాది అందోళనకు గురై పారిపోయాడు. ఇదే క్రమంలో తమపై కూడా తూటాలను వదులుతాడని భావించిన యువకులు వెనుదిరిగారు.

అదే అదనుగా భావించిన ముష్కరుడు క్షణాల్లో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలి మొత్తాన్నితమ అధీనంలోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన సిసిటీవీ ఫూటేజీలో లభించిన ఫూటేజీని పరిశీలిస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత ఉంటే ఈ విమానాశ్రయం వెళ్లే మార్గంలో ఉగ్రవాది కాల్పులకు తెగబటడంతో స్థానికులు షాక్ కు గురయ్యారు. దుండగుడి కోసం పోలీసులు అన్వేషణ సాగుతోంది. ముష్కరుడు అధిక దూరం వెళ్లే అవకాశం లేదని.. భావిస్తున్న పోలీసులు గాలింపు చర్యలు తీవ్రం చేశారు.

నిరాయుధులైన కానిస్టేబుళ్లను వెనుక నుంచి, దొంగరీతిలో దాడులు చేసి హతమార్చడం పట్ల వీరమరణం పోందిన కానిస్టేబుళ్లు మహమ్మద్ యూసుప్,సుహేల్ అహ్మద్ లకు తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నమాని జమ్ముకాశ్మీర్ పోలీసు విభాగం ట్విట్టర్ లో పోస్టు చేసింది. వీరుల కుటుంబాలకు తాము నిత్యం అందుబాటులో వుంటామని, ముఖ్యంగా ఈ విషాద సమయంలో వారికి అండగా నిలుస్తామని తెలిపింది. ఇక కానిస్టేబుళ్లను హతమార్చడం పట్ల పిడీపీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

24 దేశాలకు చెందిన దౌత్యాధికారులు ఇవాళ ఉదయం కాశ్మీర్ కు చెరుకున్న నేపథ్యంలో ఈ ఘటనలు చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. రెండు రోజుల పాటు వివిధ దేశాల దౌత్యాధికారులు జమ్మూకాశ్మీర్ లో పర్యటించనున్నారు. ఇక గత మూడు రోజుల వ్యవధిలో ఇది రెండో ఘటన. అత్యంత భద్రత ఉండే దుర్గనాగ్ ప్రాంతంలోని కృష్ణా రెస్టారెంట్ ఓనర్ కుమారుడిపై రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు కాల్పులు జరిపి హతమార్చిన ఘటన మరువక ముందే ఇవాళ ఇద్దరు కానిస్టేబుళ్లను ఉగ్రవాదులు హతమాచ్చడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Terrorist  Gun shot  Two Policemen  CCTV footage  Barzulla area  Srinagar  Jammu and Kashmir  Crime  

Other Articles