యావత్ మానవాళికి ప్రత్యక్షంగా కనిపించే సూర్యభగవానుడి జన్మదినమైన రథసప్తమిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లోని భక్తజనులు వేకువజాము నుంచే దేవాలయాలకు వెళ్లి ప్రత్యక్ష పూజలు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభం కాగా, స్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర ఫీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి. దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ సుజాత అరసవల్లి సూర్యభగవానుడికి పట్టువస్త్రాలను సమర్పించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంచెలమైన భక్తి ప్రవత్తుల నడుమ భక్తజనకోటి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఈ క్రమంలో భక్తులు అర్ధరాత్రి 12 గంటల నుండే సూర్యభగవానుడి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు.
ఇక రథసప్తమిని పురస్కారించుకుని రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్కుమార్, కంబాల జోగులు, విశ్వసరాయ కళావతి తదితరులు సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామికి తొలి పూజ చేసే అవకాశం రావడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని స్వాత్మానంద మహా సరస్వతి అన్నారు.
కాగా, ఆరోగ్యప్రదాతగా కీర్తించే స్వామి వారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తజనులు వచ్చినా.. అధికారులు మాత్రం సరైన సౌకర్యాలు చేయడంలో విఫలమయ్యారని భక్తులు అరోపిస్తున్నారు. ప్రత్యేక దర్శనం కోసం 500 రూపాయల టికెట్లు తీసుకున్న వారు కూడా క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిఉండాల్సి వస్తుందని వాపోయారు. ఎలాంటి హోదా లేని వారికి కూడా వీఐపి దర్శనం కల్పిస్తున్నారని, సమాన్య భక్తుల్ని మాత్రం ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతోనే చిన్న చిన్న సమస్యలు తలెత్తాయని ఆలయ సిబ్బంది చెప్పుకొస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more