యావత్ మానవాళికి ప్రత్యక్షంగా కనిపించే సూర్యభగవానుడి జన్మదినమైన రథసప్తమిని పురస్కరించుకుని తెలుగురాష్ట్రాల్లోని భక్తజనులు వేకువజాము నుంచే దేవాలయాలకు వెళ్లి ప్రత్యక్ష పూజలు సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో రథసప్తమి వేడుకలు అర్థరాత్రి ఘనంగా ప్రారంభం కాగా, స్వామివారు భక్తులకు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. ఆదిత్యునికి తొలి పూజ, క్షీరాభిషేకం చేశారు విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తర ఫీఠాధిపతి స్వాత్మానందేంద్ర స్వామి. దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ సుజాత అరసవల్లి సూర్యభగవానుడికి పట్టువస్త్రాలను సమర్పించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. స్వామి వారి నిజరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. రథసప్తమి రోజున స్వామి వారిని దర్శించుకుంటే సకలపాపాలు హరించి, అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అంచెలమైన భక్తి ప్రవత్తుల నడుమ భక్తజనకోటి స్వామివారిని దర్శించుకుని పునీతులవుతున్నారు. ఈ క్రమంలో భక్తులు అర్ధరాత్రి 12 గంటల నుండే సూర్యభగవానుడి దర్శనం కోసం క్యూలో నిలబడ్డారు.
ఇక రథసప్తమిని పురస్కారించుకుని రాజకీయ ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి స్వామి వారి నిజరూప దర్శనం చేసుకున్నారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటి సీఎం ధర్మాన కృష్ణదాస్, ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు, ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, గొర్లె కిరణ్కుమార్, కంబాల జోగులు, విశ్వసరాయ కళావతి తదితరులు సూర్యనారాయణస్వామిని దర్శించుకున్నారు. రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామికి తొలి పూజ చేసే అవకాశం రావడాన్ని గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని స్వాత్మానంద మహా సరస్వతి అన్నారు.
కాగా, ఆరోగ్యప్రదాతగా కీర్తించే స్వామి వారి దర్శనానికి పెద్దసంఖ్యలో భక్తజనులు వచ్చినా.. అధికారులు మాత్రం సరైన సౌకర్యాలు చేయడంలో విఫలమయ్యారని భక్తులు అరోపిస్తున్నారు. ప్రత్యేక దర్శనం కోసం 500 రూపాయల టికెట్లు తీసుకున్న వారు కూడా క్యూలైన్లలోనే గంటల తరబడి వేచిఉండాల్సి వస్తుందని వాపోయారు. ఎలాంటి హోదా లేని వారికి కూడా వీఐపి దర్శనం కల్పిస్తున్నారని, సమాన్య భక్తుల్ని మాత్రం ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండడంతోనే చిన్న చిన్న సమస్యలు తలెత్తాయని ఆలయ సిబ్బంది చెప్పుకొస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Mar 06 | టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ మరోసారి తన దురుసు ప్రవర్తనతో వార్తల్లో నిలిచారు. ఎన్నికల ప్రచారం ఎప్పుడు చేపట్టినా ఆయన తన చేతివాటాన్ని ప్రదర్శించడం పరిపాటిగా మారుతోందన్న విమర్శలకు మరోమారు... Read more
Mar 06 | ఉత్తమ సర్పంచ్గా అవార్డు తీసుకున్న వ్యక్తి రూ. 13 లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగిందీ ఘటన. ఏసీబీ కథనం ప్రకారం.. జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ... Read more
Mar 06 | సొంత పార్టీ తీసుకునే నిర్ణయాలను కూడా విమర్శించే బీజేపీనేత సుబ్రహ్మణ్యస్వామి ఇటీవల పెరుగుతున్న ఇంధన ధరలపై తనదైన శైలిలో విసిరిన పంచ్ బీజేపి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఒక విధంగా వరుసగా ఆరు రోజుల... Read more
Mar 06 | ఝార్ఖండ్లో దారుణం ఘటన జరిగింది. ఓ యువతిని బంధించిన 60 మంది దుండగులు నెలరోజులగా ఆమెపై అఘాయిత్యానికి తెగబడ్డారు. మాదకద్రవ్యాలను ఇంజెక్షన్ రూపంలో ఇస్తూ తనపై నిత్యం అఘాయిత్యానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు తెలిపింది.... Read more
Mar 06 | యావత్ ప్రపంచ దేశాల అర్థిక పరిస్థితులను కోవిడ్ మహమ్మారి అతలాకుతలం చేసిన నేపథ్యంలో దాని నుంచి బయటపడేందుకు గత ఏడాది జూన్ లో ఏర్పడిన అన్ లాక్ నుంచి ప్రతీ అంశంలో ధరాఘాతాన్ని ప్రజలు... Read more