Petrol price touches record high of Rs 87.85 per litre in Delhi వాహనదారులకు పెట్రోవాత.. వరుసగా 3వ రోజు..

Petrol diesel prices hiked for 3rd successive day scale new highs

oil price, crude oil, price hike, petrol, diesel, premium petrol price, sriganganar, rajasthan, petrol price in delhi, petrol price in mumbai, petrol price in chennai, petrol price in kolkatta, petrol price in hyderabad, petrol price in amaravati, dissel price in delhi, dissel price in mumbai, dissel price in chennai, dissel price in kolkatta, dissel price in hyderabad, dissel price in amaravati, regular petrol price, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Transportation fuel prices continue to increase, with oil marketing companies (OMCs) on Thursday raising petrol and diesel prices by 25 paise a litre and 30 paise a litre respectively in the National Capital Region (NCR).

రికార్డుస్థాయి గరిష్టం.. వాహనదారులకు పెట్రోవాత.. వరుసగా 3వ రోజు..

Posted: 02/11/2021 10:51 AM IST
Petrol diesel prices hiked for 3rd successive day scale new highs

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన నేపథ్యంలో దేశీయంగా పెట్రో ధరల పెంపు అనివార్యం అవుతోంది. ఈ క్రమంలో వరుసగా మూడవ రోజు ఇంధన ధరలు పెరిగాయి. దేశరాజధాని ఢిల్లీలో రికార్డు స్థాయిలో పెట్రోల్ ధర రూ. 87.85కు చేరింది. అంతర్జాతీయంగా బ్యారెల్ క్రూడ్ అయిల్ ధర 60.49 డాలర్లకు చేరడంతో ఇంధన ధరలకు పెట్రో సంస్థలు పెంచాయి. క్రూడ్ అయిల్ ధర ఒక్క డాలర్ పెరగిన నేపథ్యంలో భారత ఇంధన సంస్థలపై సాలినా రూ.10700 కోట్ల భారం పడుతోంది. ఈ నేపథ్యంలో నిన్న 60 డాలర్లు వున్న క్రూడ్ అయిల్ ధర ఇవాళ ఉదయం 61.06కు చేరడంతో ఇంధన ధరలపై ఆ ప్రభావం పడింది.

కాగా ధరలు తగ్గిన సమయాల్లో మాత్రం ఆ ప్రయోజనాలను వాహనదారులకు అందకుండా మధ్యలో దేశాభివృద్దికి కోసమని కేంద్రం, రాష్ట్రాభివృద్దికని రాష్ట్రప్రభుత్వాలు ఎక్సైజ్ సన్నులు, వ్యాట్ లు విధిస్తూ.. కొత్త మార్గాలను అనుసరిస్తూ అందుకుంటున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన క్రమంలో వాటి భారాన్ని వాహనదారులపై మోపే ప్రభుత్వాలు.. ధరలు తగ్గిన సమయంలో ప్రజలకు ఇంధన ధరల నుంచి ఉపశమనం లభించకుండా ఎక్సైజ్ డ్యూటీ చార్జీలను పెంచుతూ అదాయావనురుగా మార్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి.

వరుసగా మూడో రోజ పెరిగిన ఇంధన ధరల పెంపు వాహనదారులను అందోళనకు గురిచేస్తున్నాయి. ఇవాళ పెట్రోల్ పై రూ.0.25 డీజిల్ పై రూ.0.30 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధానిలోనే మునుపెన్నడూ లేని గరిష్ట రికార్డు స్థాయికి పెట్రోల్ ధర చేరుకుంది. దేశంలో మునుపెన్నడే లేని విధంగా పెట్రో ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర విధించిన పన్నులను కాసింత మినహాయించాలని వాహనదారుల నుంచి వినతతులు వ్యక్తమవుతున్నాయి. కాగా పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం, పన్నులను తగ్గించే ఆలోచన లేదని కేంద్ర పెట్రోలియంశాఖ స్పష్టం చేసింది.

రాజ్యసభలో ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటన చేస్తూ.. దేశంలో ఇంధన ధరలు అంతర్జాతీయ మార్కెట్ పై ఆధారపడి ఉంటాయని తెలిపారు. దేశ అవసరాలను తీర్చేందుకు భారత్‌ దాదాపు 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోందని.. కావున మార్కెట్ లో ముడిచమురు ధరలు పెరిగితే మనం కూడా ధరలు పెంచాల్సి వస్తుందని ఆయన బదులిచ్చారు. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవసరాలకు అనుగుణంగా పన్నులను విధించడంతో ఇంధన ధరలు పెరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో ఇంధన ధరలు ఏకంగా మునుపెన్నడూ లేని గరిష్ట స్థాయిని అందుకున్నాయి. సాధారణ పెట్రోల్ ధర లీటరు రూ.91 దాటి పరుగులు పెడుతోంది. ఇక బ్రాండెడ్ పెట్రోల్ ధర తొంభై అయిదు రూపాయలను అందుకుని ముందుకు దూసుకెళ్తోంది.

తాజాగా పెరిగిన ధరలతో న్యూఢిల్లీలో లీటరు పెట్రోలు రూ.87.85కు చేరగా, డీజిల్ రూ.78.03
కోల్ కతాలో లీటరు పెట్రోలు రూ.89.16కు చేరగా, డీజిల్ రూ. 81.61
ముంబైలో లీటరు పెట్రోలు రూ.94.36 కు చేరగా, డీజిల్ రూ.84.94
చెన్నైలో లీటరు పెట్రోలు రూ.90.19కు చేరగా, డీజిల్ రూ.83.18
హైదరాబాదులో లీటరు పెట్రోలు రూ.91.35కు చేరగా, డీజిల్ రూ.85.11
విశాఖపట్నంలో లీటరు పెట్రోలు రూ.92.78కు చేరగా, డీజిల్ రూ. 85.50
అమరావతిలో లీటరు పెట్రోల్ రూ. 93.86కు చేరగా, డీజిల్ ధర రూ.87.13కు చేరింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol prices  VAT  Diesel price  fuel retailers  global crude oil prices  Oil price  diesel  Petrol  Hyderabad  

Other Articles