Govt. asks Twitter to remove 1,178 accounts ఆ 1178 ఖాతాలను వెంటనే సస్పెండ్ చేయండీ: కేంద్రం ఆదేశం

India asks twitter to remove 1178 pakistani accounts tweeting on farmer protests

farmers protests, farmers protests delhi border, Twitter, India blocks Twitter handles, Farmer protest twitter, Twitter Accounts, Farmers Protest News, Twitter Handles, Farmers Protest Latest News, Twitter Accounts Blocked, Twitter Handles Blocked, Farmers Protest News Today, singhu border farmers protests, police barricades, protest delhi, farmers laws farm, republic day farmers, farmers tractor rally, farmers rally violent, farmers red fort, farmers farm laws, delhi police, delhi, politics

The Indian government has asked microblogging platform Twitter to remove over a thousand more accounts for allegedly spreading misinformation and provocative content around farmers' protests. It has said that the 1,178 listed handles have Pakistani and Khalistani users, official sources have said.

ఆ 1178 ఖాతాలను వెంటనే సస్పెండ్ చేయండీ: కేంద్రం ఆదేశం

Posted: 02/08/2021 12:40 PM IST
India asks twitter to remove 1178 pakistani accounts tweeting on farmer protests

కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ గత రెండు నెలలకు పైగా ఢిల్లీ శివారల్లో అన్నదాతలు నిరసనోద్యమం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ అందోళనలపై సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నవారిపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. ఏకంగా 1178 మంది ఖాతాదారుల అకౌంట్లను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించారు. ఇదివరకే రైతుల ఉద్యమంపై దుష్ర్పచారం చేస్తున్న వారి ఖాతాలను గుర్తించిన కేంద్రం వాటిపై చర్యలు తీసుకోవాలని అదేశించింది. ఇక తాజాగా ఆ జాబితాలకు అదనంగా ఈ కొత్త జాజితా చేరింది.

గత నెల 31న రైతుల ఉద్యమాలపై దుష్ప్రచారం చేస్తున్న 257 ట్విట్టర్ ఖాతాల జాబితాను ఆ సంస్థకు పంపిన కేంద్ర హోం మంత్రిత్వశాఖ.. వాటిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక తాజాగా మరో 1178 ఖాతాలను కూడా నిలిపివేయాలని అదేశిస్తూ ఆ జాబితాను ట్విట్టర్ కు పంపింది. కేంద్ర హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాల నేపథ్యంలో కేంద్ర ఐటీమంత్రిత్వ శాఖ ఈ మేరకు ట్విట్టర్ భారత విభాగానికి ఈ మేరకు అదేశాలను జారీ చేసింది. ఈ ఖాతాలన్ని పాకిస్థాన్, ఖలిస్తాన్ కు చెందని యూజర్లవని, అయితే తప్పుడు వార్తలను విరివిగా ప్రచారం చేసేందుకు వీరు సాంకేతికగంగా పలు అటోమేటడ్ బోట్స్ కూడా వినియోగిస్తున్నారని తెలిపింది.

రైతు నిరసనోద్యమంలో భాగంగా దుష్ప్రచారం చేస్తున్న ఈ ఖాతాలు.. అదే సమయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగోట్టేలా ట్వీట్లు చేస్తున్నాయని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కోంది. అలా తప్పుడు సమాచారం చేరవేస్తూ ప్రజల్లో అయోమయ పరిస్థితికి కారణం అవుతున్న ఈ ఖాతాలను తక్షణం నిలిపి వేయాల్సిందగా కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్ ను అదేశించింది. అయితే కేంద్రమంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన అదేశాలపై ఇప్పటికే ఇంకా ట్విట్టర్ స్పందించినట్టుగా లేదు. జనవరి 31న కేంద్రప్రభుత్వం అదేశాలను స్వల్పకాలింగా అమలు చేసిన ట్విట్టర్ ఇప్పడు మాత్రం అసలు స్పందించలేదు.

జనవరి 31న 257 ట్విట్టర్ ఖాతాదారుల అకౌంట్లను నిలిపి వేయాలని భారత ప్రభుత్వం వినతిని మన్నించిన ట్విట్టర్ వాటిని కొన్ని గంటల తరువాత వాటి సర్వీసులను పునరుద్దరించింది. దీంతో కేంద్రప్రభుత్వం ట్విట్టర్ పై తన అగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక తాజాగా ఈ నెల 4న అదేశించిన 1178 ఖాతాలపై ఇప్పటివరకు అసలు స్పందించలేదు. ఇక మరోవైపు ట్విట్టర్ గ్లోబల్ సీఈఓ జాక్ డార్సీ.. రైతుల ఉద్యమాలపై స్పందించిన పలు విదేశీ సెలబ్రిటీల ట్వీట్లను ఆయన స్వయంగా లైక్ చేయడంతో భారత ట్విట్టర్ విభాగం సంధిగ్ధంలో వుంది. ఇక ఈ నేపథ్యంలో ట్విట్టర్ కేంద్రం అదేశాలను అమలుపర్చే విషయంలో పలు సందేహాలు తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles