అగ్రరాజ్యంలో క్షణికావేశాం ముగ్గురి ప్రాణాలను బలిగొనింది. అమెరికాలో శీతాకాలంలో మంచుతుఫాను కురుస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఇరుగు పోరుగున వుండేవారి మధ్య గత సోమవారం వివాదం తలెత్తింది. సోమవారం నాడు మంచును తొలగించే విషయంలో వీరిద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుని వారు ఇరువురు పారలతోనే దాడి చేసుకున్నారు. ఆ తరువాత ఇరుగుపోరుగున వుండే వారిమధ్య మాటా మాటా పెరింగింది. దీంతో తుపాకీని చేతబట్టి వచ్చిన ఓ ఇంజనీరు తన ఇంటి పోరుగున వుండే రిటైర్డు నావి అధికారి దంపతులపై కాల్పులు జరిపాడు. ఆ తరువాత ఆయన కూడా తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
క్షణికావేశంలో.. తమ మాట నెగ్గాలనే పంతానికి మూడు ప్రాణాలు బలైన ఘటన స్థానికులను కలిచివేసింది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం సోమవారం రోజున పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ప్లెయిన్స్ టౌన్ షిప్ లో నివాసముంటున్న ఇరుగుపోరుగు వారి మధ్య వివాదం తలెత్తింది. మంచు తుఫాను కురిసే క్రమంలో దానిని తొలగించే విషయమై వీరి మధ్య వివాదం రేగింద. ఇది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఆతరువాత ప్రాణాలనే హరించింది. జెఫ్రీ స్పెయిడ్ అనే ఇంజనీరు తన ఇంటి పోరుగున వున్న దంపతులు జేమ్స్ జాయ్, లీసాలను తుపాకీ తో కాల్చి తాను ఆదే తుపాకీ ఆత్మహత్యకు పాల్పడ్డారు.
మంచు తొలగించే విషయంలో వారి మధ్య మాటా మటా పెరిగింది. మరోమారు తమ వద్దకు వచ్చి ఇబ్బంది పెడితే ఇక ఉపేక్షించను.. పంచులిచ్చేస్తానని తన జేమ్స్ జాయ్, ఆ తరువాత ఆయన భార్య లీసాలు.. జెఫ్రీపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అదే సమయంలో ఇద్దరూ నడి వీధిలోకి వచ్చి వీధిలోని వారంతా చూసేలా జెఫ్రీని దుర్భాషలాగారు, అంతేకాదు అతడ్ని అసభ్య పదజాలంతోనూ దూషించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన జెఫ్రీ తుపాకీని తీసుకువచ్చి ఆ దంపతులపై కాల్పులు జరిపి వారిని హత్యచేశాడు. ఆ తరువాత తన అవేశం ఇద్దరి ప్రాణాలను తీసిందని గ్రహించిన తాను.. తనకు తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more