Petrol, diesel prices at an all-time high రికార్డు గరిష్టానికి ఇంధన ధరలు.. వంద దాటేసిన పెట్రోల్

Petrol price at an all time high crosses rs 100 in this rajasthan city

oil price, crude oil, price hike, petrol, diesel, premium petrol price, sriganganar, rajasthan, petrol price in delhi, petrol price in mumbai, petrol price in chennai, petrol price in kolkatta, petrol price in hyderabad, petrol price in amaravati, dissel price in delhi, dissel price in mumbai, dissel price in chennai, dissel price in kolkatta, dissel price in hyderabad, dissel price in amaravati, regular petrol price, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices are hitting fresh record highs in the country every day as global crude oil prices continue to climb. After the fresh rate hike by oil marketing companies (OMC), the price of branded or premium petrol has crossed Rs 100 per litre in a Rajasthan city. In Rajasthan’s Sriganganar, the price of premium petrol has now crossed Rs 101 per litre, while normal petrol costs Rs 98.40.

రికార్డు గరిష్టానికి ఇంధన ధరలు.. వంద దాటేసిన పెట్రోల్

Posted: 01/28/2021 11:15 AM IST
Petrol price at an all time high crosses rs 100 in this rajasthan city

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన ప్రతీసారి ఎలాంటి సంకోచం లేకుండా ఉన్నపళంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే కేంద్రప్రభుత్వం.. ఆదే ధరలు తగ్గిన సమయాల్లో మాత్రం ఆ ఫలాలను వాహనదారులకు అందించడంలో కొత్త పద్దతులను అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా ఇంధనధరలు పెరిగిన క్రమంలో వాటి భారాన్ని వాహనదారులపై మోపే ప్రభుత్వం.. ధరలు తగ్గిన సమయంలో ప్రజలకు ఇంధన ధరల నుంచి ఉపశమనం లభించకుండా ఎక్సైజ్ డ్యూటీ చార్జీలను పెంచుతూ అదాయ వనరుగా మార్చుకోవడానికే ప్రాధాన్యతనిస్తున్నాయి.

ఇక కరోనా వాక్సీన్ వచ్చేసిన నేపథ్యంలో అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలు వస్తున్నాయి, రోజురోజుకీ ఇంధన ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ధరలను నియంత్రించాలని గత ఏడాది కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేయడంతో దిగివచ్చిన ప్రభుత్వం.. ఇంధన ధరలపై ఆచితూచి వ్యవహరించింది. ఇక గత నెల రోజుల తరువాత ఈ ఏడాది జనవరి 6న ఇంధన ధరలను ఒక్కసారిగా పెంచాయి దేశీయ ఇంధన సంస్థలు. ఇక అప్పటి నుంచి క్రమంగా పెరుగుతూ తగ్గుతూ వస్తున్న ఆయిల్ ధరలు.. పలు పట్టణాల్లో తాజాగా శతకం చేరువలోకి చేరకున్నాయి.

బుధవారం రోజలు కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ అనుమతి మేరకు దేశీయ ఇంధన సంస్థలు పెట్రోల్, డీజిల్ పై ధరలను రూ.0.25 మేర పెంచాయి. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర అత్యంత గరిష్టానికి చేరి 86.30గా నమోదు కాగా, డీజిల్ ధర రూ. 76.48కి చేరింది. దీంతో దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై లీటర్ పెట్రోల్ రూ. 92.86కి చేరింది. కోల్ కతాలో రూ.87.69, చెన్నైలో రూ. 88.82, హైదరాబాద్ లో రూ. 89.77గా ఉంది. మరోవైపు డీజిల్‌ ధర హైదరాబాద్‌లో రూ. 83.46, ముంబయిలో రూ. 83.30, కోల్‌కతాలో రూ. 80.08, చెన్నైలో రూ. 81.71కి చేరింది.

అయితే దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేని అత్యంత అధిక స్థాయికి తొలిసారిగా చేరిన ఇంధన ధరలు ఏకంగా శతకాన్ని తాకింది. రాజస్థాన్ లో బ్రాండెండ్ పెట్రోలియం ధర రూ. 101.15గా నమోదైంది. రాజస్థాన్ లోని శ్రీగంగానర్ పట్టణంలో ప్రీమియం పెట్రోల్ ధర శతకాన్ని దాటిన నేపథ్యంలో వాహనదారులు విస్మయం చెందుతున్నారు. ఇక అదే సమయంలో సాధారణ పెట్రోల్ ధర కూడా అదే స్థాయిలో వుండటంతో వాహనదారుల్లోనూ పెట్రోల్ ధరలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. నరేంద్రమోడీ హయంలో ఏకంగా పద్దెనిమిది రూపాయల మేర పెంచిన ఎక్సైజ్ పన్నులను కేంద్రం ఎందుకు తగ్గించడం లేదన్న ప్రశ్నలు కూడా వాహనదారుల నుంచి వ్యక్తమవుతున్నాయి.

అయితే అంతర్జాతీయంగా ధరలు రికార్డు స్థాయి గరిష్టానికి పెంచిన నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఎక్సైజ్ పన్నును తగ్గించి వాహనదారులకు ఊరట కలిగించేంది. అదే పద్దతిలో గత 2018 అక్టోబర్ 4న కేంద్రప్రభుత్వం ఇంధన ధరలపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. పెట్రోల్ పై రూ.1.50, డీజిల్ పై రూ.1.00 తగ్గించి వాహనదారులకు ఉపశమనం కలిగించింది. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశ ఆర్థిక పరిస్థితులపై తీవ్ర ప్రభావం పడుతున్న నేపథ్యంలో కేంద్రం మరోమారు ఎక్సైజ్ డ్యూటీని తగ్గించే అవకాశాలు లేకపోవచ్చు. అయితే ఈ సారి ఏకంగా సాధారణ పెట్రోల్ ధర ఏకంగా వంద రూపాయాలను కూడా దాటేసే అవకాశాలు లేకపోలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Petrol prices  VAT  Diesel price  fuel retailers  global crude oil prices  Oil price  diesel  Petrol  

Other Articles