కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత కూడా వారిని మహమ్మారి కబళించివేస్తుందన్న వార్తలు కూడా వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ప్రపంచంతో పాటు ఏపీలోనూ కరోనా కేసులు, మరణాలు అధికంగానే నమోదయ్యాయి, ఇక అరోగ్యం విషయంలో అటు వైద్యారోగ్యశాఖ అధికారులతో పాటు ఇటు ప్రజలంతా అప్రమత్తంగా వున్న తరుణంలో పశ్చిమ గోదావరి జిల్లాలను మాత్రం వింతవ్యాధులు అతలాకుతలం చేస్తున్నాయి,
జిల్లాలోని ఏలూరులో వింత వ్యాధితో దాదాపు 600 మందిని ప్రభావితం చేసి.. పలువురిని కబళించింది. గత ఏడాది డిసెంబర్ 5న వెలుగుచూసిన వింత వ్యాధి ఘటన పరిసర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. అప్పట్లో ఈ వ్యాధి కారణంగా పలువురు ప్రజలు సృహకోల్పోయి వాంతులు, విరోచనాలు, కడుపు నోప్పి కారణంగా అసుపత్రుల పాలయ్యారు. దాని నుంచి మెల్లిగా కోలుకున్న జిల్లా వాసులను మరో అదే తరహా వింత వ్యాధి భయాందోళనకు గురిచేస్తోంది. భీమడోలు మండలంలోని పుల్ల గ్రామంతో పాటు పరిసర గ్రామాల్లోని ప్రజలు అకస్మాత్తుగా సృహకోల్పోతున్నారు. ఏలూరులో వెలుగుచూసిన తరహా వ్యాధి లక్షణాలతోనే స్థానికులు అసుపత్రుల పాలవుతున్నారు. మండలంలోని పుల్లా సహా పలు గ్రామాలలో ఒక మర్మమైన అనారోగ్యం కారణంగా పదహారు మంది గ్రామస్తులు అకస్మాత్తుగా సృహకోల్పోయారు.
పుల్ల గ్రామంలో వింతవ్యాధి బారిన ప్రజలు పడుతున్నారన్న సమాచారంతో వైద్యశాఖ అధికారులు ఆయా ప్రాంతాలలో అలర్ట్ చేశారు, గ్రామంలో ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసి పరిస్థితి అదుపులో ఉందని అధికారులు తెలిపారు. బాధితులను స్థానిక ప్రైవేటు అసుపత్రులతో పాటు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికత్స అందిస్తున్నారు, అయితే చికిత్స అందుతున్న పదహారు మంది పరిస్థితి నిలకడగా ఉందని వైద్యఅరోగ్య అధికారులు పేర్కొన్నారు. వైద్య, ఆరోగ్య, రెవెన్యూ అధికారులు పుల్లా గ్రామానికి చేరుకుని రోగుల ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. కలుషిత ఆహారం, నీరు కారణంగానే అనారోగ్య పరిస్థితులు తలెత్తాయని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more