(Image source from: Timesofindia.indiatimes.com)
ఆరుగురి మరణంతో పాటు వందలాది మంది క్షతగాత్రులయ్యేందుకు కారణమైన 2008 మాలేగావ్ పేలుళ్ల కేసు నిందితురాలు, భోపాల్ బీజేపీ ఎంపీ ప్రగ్యా ఠాకూర్ ముంబైలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విచారణకు సినీపక్కీలో డుమ్మా కొట్టారు. సినిమాల్లో న్యాయస్థానం హాజరు నుంచి తప్పించుకునేందుకు ఆసుపత్రులలో చేరి నాటకమాడినట్టుగానే.. బీజేపి ఎంపీ ప్రగ్యా ఠాకూర్ కూడా మహారాష్ట్రలోని మాలేగావ్ పేలుళ్ల కేసు నుంచి తప్పించుకునేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రిలో చేరారని వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో సుదీర్ఘకాలంగా విచారణ వాయిదా పడిన ఈ కేసును ఈ నెల ఆరంభంలో ఎన్ఐఏ న్యాయస్థానం విచారణను ప్రారంభించింది.
గతంలో వున్న న్యాయమూర్తి బదిలీ కాగా, ఈ కేసులో జస్టిస్ పీఆర్ సింట్రే ప్రత్యేక ఎన్ఐఏ న్యాయస్థానం న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు, ఈ నేపథ్యంలో ఈ నెల ఆరంగంలోనే ఈ కేసులో నిందితులైన ఏడుగురు కోర్టు ఎదుట హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. అయినప్పటికీ తాజా విచారణకు ముగ్గురు మినహా ప్రగ్యాసింగ్, రమేశ్ ఉపాధ్యాయ్, సుధాకర్ ద్వివేదీ, సుధాకర్ చతుర్వేదిలు హాజరు కాలేదు. కరోనా నేపథ్యంలో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతోనే వీరు రాలేకపోయారని వారి తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో న్యాయస్థానం ఈ కేసు విచారణణ ఇవాళ్టికి వాయిదా వేసింది, ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం ఇవాళ సమన్లు ఇవ్వాలని కోర్టు నిర్ణయించింది.
కాగా, ఆరోగ్య పరీక్షల కోసం ఎయిమ్స్కు వెళ్లిన ప్రగ్యాసింగ్ వైద్యుల సలహా మేరకు ఆసుపత్రిలో చేరారు. విచారణకు హాజరుకావడానికి ప్రగ్యాసింగ్ ముంబైకి రావాలని అనుకున్నారని, రెండు రోజులపాటు ఇక్కడే ఉండాలని అనుకున్నారని, అయితే, రెగ్యులర్ చెకప్ కోసం ఎయిమ్స్కు వెళ్లిన ఆమె వైద్యుల సూచనతో ఆసుపత్రిలో చేరారని ఆమె తరపు న్యాయవాది జేపీ మిశ్రా కోర్టుకు తెలిపారు. అయితే, ఆమె ఎలాంటి చికిత్స తీసుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా, 29 సెప్టెంబరు 2008న దేశ ఆర్థిక రాజధాని ముంబైకి సుమారు 270 కిలోమీటర్ల దూరంలోని మాలేగావ్లో మసీదు సమీపంలో ఓ మోటారు సైకిల్ కు బిగించిన బాంబు పేలుళ్లలో ఆరుగురు చనిపోగా, 100 మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more