కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు గత పదహారు రోజులుగా ఢిల్లీలోని శివారు సింఘు ప్రాంతంలో నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ బిల్లులపై అటు కేంద్రం ఇటు రైతులు పట్టువీడకపోవడంతో ఇరువర్గాలకు మద్య నెలకొన్న ప్రతిష్టంభన కొనసాగుతూనే వుంది. భారత్ బంద్ కు పిలుపునిచ్చి జయప్రదం చేసిన రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతు సంఘాల నేతలతో భేటీ తరువాత తమకు అనుకూలంగా నిర్ణయాలు వస్తాయని రైతు సంఘాలు భావించారు. అయితే ప్రతిపాదనలను పంపుతామన్న కేంద్రమంత్రి మంత్రి హామీతో వెళ్లిన రైతు సంఘాలు కేంద్రం తాజాగా పంపిన ప్రతిపాదనలు కూడా తమకు అనుకూలంగా లేవని వాటిని వ్యతిరేకించారు.
దీంతో నూతన వ్యవసాయ బిల్లులను భేషరుతుగా కేంద్రం ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు, ఈ క్రమంలో మరో అడుగు ముందుకేసిన రైతు సంఘాలు కేంద్రంలోని బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అన్ని రాష్ట్రాలు, జిల్లా బీజేపి కార్యాలయాల ముట్టడికి కూడా పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అటు బీజేపి కూడా తాము తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులు రైతులకు ఏ విధంగానూ వ్యతిరేకం కాదన్న విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసీన పలువురు రైతులు, రైతు మద్దతు దారులు కేంద్రం తీసుకువచ్చిన బిల్లలకు వ్యతిరేకంగా న్యాయపోరాటం కూడా చేస్తున్నారు.
దేశంలోని కార్పోరేట్ దిగ్గజాలకు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా అప్పగించి.. రైతును తన పోలంలో తననే కూలీగా మార్చే చట్టాలను కేంద్రం ఎలా ప్రోత్సహిస్తుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. రైతులు పండించే పంటపై రైతుకు అధికారం లేకుండా ప్రతి గింజకు, ప్రతీ కాయకు కార్పోరేట్ లెక్కలు కడుతోందని, దిగుబడి, నాణ్యతపై అధారపడే వారు పంట ఉత్సత్తులకు ధర నిర్ణయిస్తారని అరోపిస్తున్నారు. ఇక కార్పోరేట్ సంస్థలు వ్యవసాయ దిగుబడులపై చూపించే ఉత్సాహం.. భూమిసారంపై చూపరని, రసాయనాలు, ఇతరాత్రాలతో పంట దిగుబడి పెంచేలా చేసే ప్రక్రియలో భూమి తన సారవంతాన్ని కోల్పోతుందని, ఆ భూమిని తాము ఏం చేసుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. తమ అభ్యంతరాల నేపథ్యంలో కేంద్రం తాము తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లులను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు,
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more