ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టులో చుక్కెదురైంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న రాష్ట్ర ఎన్నికల సంఘం.. తమకు ఎలాంటి సమాచారం అందించకుండా అడుగులు వేస్తోందని ఈ నేపథ్యంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించకుండా స్టే విధించాలని ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ ను తోసిపుచ్చిన న్యాయస్థానం.. ఈ అంశంలో స్టే విధించడానికి నిరాకరించింది. కరోనావైరస్ మహమ్మారి జడలు విప్పిన తరుణంలో ప్రజలు ఓట్ల కోసం సామాజిక దూరం పాటించకుండా పోలింగ్ కేంద్రాలకు వస్తే.. దాని ప్రభావం ప్రజారోగ్యంపై పడే ప్రమాదముందని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చింది.
ఈ ఏడాది మార్చి మాసంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం ఏర్పాట్లను చేసినా.. రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వాటిని చివరి నిమిషంలో వాయిదా వేశారు. అందుకు కరోనా వైరస్ మహమ్మారి విజృంభన కారణంగా చూపారు. అనుకున్నట్లుగానే కరోనా రాష్ట్ర ప్రజలను పట్టిపీడించింది, అయితే ప్రస్తుత తరుణంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో బిహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణ జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా విజయవంతంగా పూర్తైన క్రమంలో రాష్ట్రంలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమీషన్ మూడు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసిన విషయం తెలిసిందే.
అయితే అదే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికలను నిర్వహించడం సముచితం కాదని రాష్ట్రప్రభుత్వం చెబుతూవస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించడంపై ఏపీ సర్కారు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తరఫున పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ పిటిషన్ పై హైకోర్టు విచారిస్తూ.. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరపాలన్న నిర్ణయంపై స్టే ఇవ్వలేమని ప్రభుత్వ పిటీషన్ ను తోసిపుచ్చింది. పిటిషన్ పై తదుపరి విచారణను ఈ నెల 14కు వాయిదా వేసింది. అదే సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కౌంటర్ దాఖలు చేయాలని అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more