కరోనా మహమ్మారి విజృంభనతో భయాందోళనకు గురైన ఆంధ్రప్రదేశ్ వాసులను తాజాగా వింత వ్యాధి కలవర పెడుతోంది. ఎందుకు వస్తోందో.. కారణాలేంటో కూడా తెలియకపోవడంతో ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుందో కూడా తెలియని ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ వాసులు గురవుతున్నారు. కాగా ఈ వ్యాధి బారిన పడిన వారు త్వరగానే కోలుకుంటున్న నేపథ్యంలో వైద్యవర్గాలతో పాటు ప్రజలు కూడా కొంత ఉపశమనం పోందుతున్నారు. మరీముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఈ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అనూహ్యంగా పెరుగుతున్న బాధితులతో జిల్లా అసుపత్రిలో తీవ్ర కలవరం రెకెత్తుతోంది.
ఆదివారం రోజు ఏకంగా మూడువందల మందిని పాకిన ఈ వ్యాధి.. తాజాగా సోమవారం రోజుల ఈ సంఖ్యను మరింత పెంచుకుంది. దీంతో ఏకంగా ఐదు వందలకు ఈ సంఖ్య పెరిగింది. కోవిడ్ మహమ్మారి కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటికే వేలాది మంది చికిత్సపొంది కోలుకోగా వందలాది మంది అసువులు బాసారు. ఈ క్రమంలోనే మరో అంతుచిక్కని మహమ్మారి ఏలూరు వాసులను అందోళనకు గురిచేస్తోంది. శనివారం నుంచి అకస్మికంగా ఈ వ్యాధిబారిన పడుతున్న స్థానికుల సంఖ్య సోమవారం వరకు 300ల పైగా చేరగా, సోమవారం ఒక్క రోజునే ఏకంగా రెండు వందల మంది ఈ వ్యాధి బారిన పడి ఆసుపత్రులలో చికిత్స పోందుతున్నారు.
శనివారం రోజన ఏకంగా 108 మంది అసుపత్రిలో చేరగా అదివారం 209 మంది, సోమవారం రోజున మరో 200 మంది ఈ గుర్తుతెలియని వ్యాధి బారిన పడ్డారు. కాగా వీరిలో మొత్తంగా 332 మంది రోగులు త్వరగానే కోలుకుని డిశ్చార్జ్ అయినట్టు వైద్య, అరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. కాగా, పరిస్థితి విషమంగా వున్న 19 మంది రోగులను మాత్రం సమీపంలోని మల్టీ స్పెషాలిటీ అసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ వింతవ్యాధి బారిన పడిన వందలాది మంది అసుపత్రులకు చేరుకుంటున్నా.. ఈ వ్యాధికి గల కారణాలు మాత్రం ఇంకా అంతుచిక్కడం లేదు. ఈ వ్యాధి బారిన పడుతున్నవారిలో అత్యధికులు 20 నుంచి 30 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. అయితే ఈ వార్తతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ తీవ్ర కలవరం రేకెత్తుతోంది.
అయితే ఏకంగా 12 ఏళ్లు వారితో పాటు అటు నలభై ఏళ్లకు పైబడిన వారు కూడా బాధితుల్లో వున్నారు. చికిత్స పోందుతున్న వారిలో 71 మంది చిన్నారులు, 27 మంది మహిళలు వున్నారు. రక్తపోటు, షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో పాటు ఎలాంటి రోగాల బారిన పడనివారు కూడా ఈ వింత వ్యాధిబారిన పడుతూ ఆసుపత్రులకు చేరడం చర్చనీయాంశంగా మారింది. కాగా కారణాలను తెలుసుకునే పనిలో పడిన ఎయిమ్స్ వైద్యులు రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లోహాలు అధికంగా వున్నట్లు గుర్తించారు. తాగునీరు, పాల ద్వారా ఈ అవశేషాలు రోగుల శరీరంలోకి చేరి ఉంటాయని వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more