కేరళలోని పశ్చిమ కనుమల్లో నెలకొన్న శబరిమల కొండపై వెలసిన హరిహరసుతుడు అయ్యప్పస్వామిని ప్రతీ ఏడు లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. కాగా, ఈ ఏడాది కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో భక్తుల దర్శనాలపై కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు పలు ఆంక్షలను విధించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుత మండల పూజలు, మకర విళక్కు సీజన్ లో స్వామి దర్శనానికి దేశవ్యాప్తంగా అశేషసంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయినా కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో రోజుకు 1000 భక్తులను.. అందులోనూ మాత్రమే శబరిగిరీశుడి దర్శినాన్ని కల్పిస్తోంది. ఈ సంఖ్యను వారంతంలో మాత్రం రెండు వేలకు పెంచింది.
దీంతో స్వామి దర్శనానికి వెళ్లాలని భావించే భక్తులకు నిరాశే ఎదురైంది. కాగా ఇలా నిరాశ చెందిన అయ్యప్ప స్వామి భక్తుల కోసం కేరళ సర్కార్ తాజాగా శుభవార్తను అందించింది. ప్రస్తుతం రోజువారీగా అనుమతిస్తున్న భక్తుల సంఖ్యను పెంచుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం సంఖ్యకు రెండింతలు చేసి ఇకపై రోజుకు 2000 మంది, వారాంతంలో 3 వేల మందిని అనుమతిస్తామని పేర్కోంది. ఈ మేరకు కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే స్వామి దర్శనానికి రావాలని నిర్ణయించుకున్న భక్తులందరూ తప్పనిసరిగా వర్చువల్ క్యూలో ముందస్తు దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని అదేశించారు. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికీ కరోనా సర్టిఫికెట్ తప్పనిసరని ఆయన తెలిపారు.
పంబ నుంచి అయ్యప్ప స్వామి సన్నిధానం చేరుకునే వరకూ వెళ్లే దారిలో కొవిడ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ఎవరిలో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే కోవిడ్ కేంద్రాలలో చేరాలని ఆయన పేర్కోన్నారు. భక్తులు కరోనా నిబంధనలన్నింటినీ పాటించాలని ఆయన సూచించారు. అయితే ముందస్తుగా కేరళ సర్కారు తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా అయ్యప్ప స్వామి భక్తులు ఆంక్షల నేపథ్యంలో చతికిలపడ్డారు. కార్తీకమాసం ప్రారంభమై పక్షం రోజులు గుడుస్తున్నా అయ్యప్ప మాలలు వేసుకున్న భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది. మాలలో ఉన్నవారిలో అత్యధికులు ఈ సంవత్సరం కేరళ వెళ్లే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని, స్థానికంగా ఉన్న అయ్యప్ప ఆలయాల్లోనే దీక్షా విరమణలకు ఏర్పాట్లు చేస్తున్నామని గురుస్వాములు తెలియజేశారు. రవాణా సౌకర్యాల లభ్యత, ముఖ్యంగా పరిమత సంఖ్యలోనే తిరుగుతున్న రైళ్లు కూడా భక్తుల సంఖ్య తగ్గడానికి కారణమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more