(Image source from: Twitter.com/trspartyonline)
నాగార్జున సాగర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇవాళ అనారోగ్యంతో కన్నుమూశారు. నల్గొండ జిల్లా అభివృద్దిలో తన వంతు సాయాన్ని అందించిన ప్రజానాయకుడు అనారోగ్యం బారినపడి.. గత కొంతకాలంగా ఓ ప్రైవేటు అసుపత్రిలో చికిత్సపోందుతున్నారు. కాగా ఇవాళ ఉదయం పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. విద్యార్థి నాయకుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే నాయకుడి లక్షణాలను అందిపుచ్చుకున్న ఆయన ఆ తరువాత తన సొంత మండలంలో మండల పరిషత్ అధ్యక్షుడిగా కూడా దశాబ్ద కాలం పాటు సేవలు అందించారు.
ఆయన చేసిన సేవలను నకిరేకల్ అసెంబ్లీ ప్రజలు కూడా అమోదించారు. దీంతో ఆయన నకిరేకల్ అసెంబ్లీ స్థానం నుంచి 1999, 2004 రెండు పర్యాయాలు సీపీఎం పార్టీ ఎమ్మెల్యేగా కూడా ఎన్నికై తన నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలను అందించారు. ఆ తరువాత ఆయన 2009లో భువనగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత 2014లో ఆయన నాగార్జునసాగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో పరాభవం పాలయ్యారు. కాగా 2018లో జరిగిన ఎన్నికలలో ఆయన జానారెడ్డిని దాదాపు ఏడు వేల ఓట్ల మోజారిటీతో ఓడించి.. చారిత్రక విజయాన్ని అందుకున్నారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయవాది పట్టాను అందుకున్న ఆయన అప్పటి ఉమ్మడి అంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా కూడా కొనసాగారు. 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆయన నాగార్జున సాగర్ అసెంబ్లీ స్థానంపై గురిపెట్టి విజయాన్ని అందుకున్నారు, ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు వున్నారు. కుమారుడు కూడా న్యాయవాదిగా రాణిస్తుండగా, ఇద్దరు కుమార్తెలు విదేశాలలో వున్నారు. నోముల నర్సింహయ్య మృతి విషయం తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు, నోముల నర్సింహయ్య ప్రజానాయకుడని కోనియాడిని సీఎం ఆయన కుటుంబానికి ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Jan 19 | ఆంధ్రప్రదేశ్ లో గ్రామస్థాయిలో ఎన్నికల నిర్వహణ పంచాయితీ హైకోర్టుకు చేరిన తరుణంలో ఎన్నికల నిర్వహణ వుంటుందా.? లేదా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరిలో నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల... Read more
Jan 19 | అనునిత్యం దేశం కోసం.. దేశభక్తి కోసం ప్రసంగాలు గుప్పించే వ్యక్తుల నుంచి దేశానికి సంబంధించిన అత్యంత గోప్యమైన సమాచారం ఓ జర్నలిస్టుకు లీక్ కావడంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రంగా... Read more
Jan 19 | హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ లిమిటెడ్ సంస్థ రూపోందించిన కరోనా వాక్సీన్ కోవాక్సీన్ ను మూడవ దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అత్యవసర వినియోగం కోసం లైసెన్స్ పొందిన విషయం తెలిసిందే. అయితే... Read more
Jan 19 | నాగార్జునసాగర్ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలలో భారీ మెజారిటీని సాధించేందుకు పూర్తిస్థాయిలో సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలో తమకు ఎదురులేదని.. మోనార్క్ ముద్రను వేసుకున్న టీఆర్ఎస్ ఇకపై ఎన్నికలంటే... Read more
Jan 19 | కరోనా మహమ్మారి ప్రపంచ మానవాళిని భయం గుప్పెట్లోకి నెట్టిన తరువాత రెండో వేవ్ అంటూ భయాలు ఉత్పన్నమైన వేళ.. సెకెండ్ స్ట్రెయిన్ కూడా పలు దేశాలను అతలాకుతలం చేసింది. కరోనా నుంచి కోలుకున్న తరువాత... Read more