భూమిపై ప్రకృతి సమతుల్యత పాటించేలా జీవులన్నీ ఒకదానిపై మరోకటి ఆదారపడి మనుగడ సాగిస్తుంటాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చేపలను తినేందుకు కొంగలు సృష్టించబడ్డాయన్నది కాదనలేని విషయం. అయితే అన్ని చేపలను చటుక్కున పట్టుకుని తినే కొంగలు అదే తరహాలో మలుగు చేపలను పట్టుకుంటే ఏమౌతుందో ఈ ఘటన మనకు తెలిపుతుంది. అమెరికాలోని మేరీల్యాండ్ లో సామ్ డేవిస్ అనే ఇంజనీర్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ గా మారాడు. తన తీరిక సమయాల్లో వైల్డ్ లైఫ్ ఫోటోలను తీసి దాచుకుంటాడు. ఈ క్రమంలో ఇటీవల ఆయన తన తీరిక సమయంలో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ కోసం సంచరిస్తుండగా ఆసక్తికర దృశ్యం కంటపడింది.
అమెరికాలోని మేరీల్యాండ్ అటవ ప్రాంతంలో ఫొటోలు తీస్తుండగా, కొంగ జాతికి చెందిన ఓ హెరాన్ పక్షి పొట్ట చీల్చుకుని మలుగు (ఈల్) చేప బయటికి వచ్చిన దృశ్యం అతని కంటబడింది. దీంతో వెంటనే తన కెమెరాను క్లిక్ మనిపించాడు శామ్ డేవిస్. అయితే ఇలా ఫోటోలు తీస్తున్న సమయంలోనూ కొంగ ఎగురుతూ రావడాన్ని చూసి కొండ మెడ భాగంలో అది అతుక్కుపోయిందని భావించాడు. కానీ అది ఈల్ చేపని ఏకంగా కొంగ గొంతును చీల్చుకుని బయటకు వచ్చేసిందని తాను ఇంటికి వెళ్లిన తరువాత ఫోటోలు ఎడిట్ చేసిన తరువాత కానీ అతనికి తెలియలేదు, కొంగ జీర్ణశయంలో ఆహారంగా మారడం ఇష్టంలేని ఈల్ చేప కొంగ గొంతును చీల్చుకుని బయటకు వచ్చినట్టు గుర్తించాడు.
అయితే ఇలా పొట్ట చీలిపోయన తరువాత సాధారణంగా ఏ పక్షి అయినా మరణిస్తుందని, కానీ ఈ గ్రేట్ బ్లూ హెరన్ జాతికి చెందిన కొంగ మాత్రం ఎగురుతూనే వుండటంతో శామ్ ఆశ్చర్యపోయాడు, సాధారణంగా సముద్ర తీరాల్లోని సున్నితమైన ఇసుక వుంటే ప్రాంతంలోపల వుంటే ఈల్ చేపలు ఐదు నుంచి ఏడు మీటర్ల పోడవులో వుంటాయని, వీటికి అత్యంత పదునుగా వుండే తోకలతో మట్టిని తోవ్వుకుంటూ లోనికి వెళ్తాయి. ఇలానే ఈ కొంగ తనను సజీవంగా మింగేయగానే దాని పొట్టను చీల్చుకుంటూ ఈల్ చేప బయటకు వచ్చింది. పోటోలు తీసిన తరువాత వాటిని పరిశీలిస్తే ఈల్ చేప ఇంకా సజీవంగానే వుందని, ఫొటోగ్రాఫర్ శామ్ డేవిస్ వెల్లడించాడు. ఇక దానిని కొంగ కూడా బతికుండడం విస్మయానికి గురిచేస్తుందని అన్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more