ఆర్థిక స్థోమత సరిగ్గా లేకపోవటంతో చదవుకోలేక ఓ విద్యాకుసుమం రాలిపోయింది. తనకు సరస్వతి కటాక్షం వున్నా లక్ష్మీ కటాక్షం లేదని దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని అవేదన చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అలస్యంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణలోని పాలమూరు జిల్లా షాద్ నగర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వర్య.. తనకు చదువుకునే మార్గం కానరాక ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని ప్రచార ఆర్భటమే తప్ప.. వాస్తవంలో లేకనే అర్థికంగా అనగారిన ఓ విద్యాసుమం రాలిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. కేవలం డబ్బులేకపోవటంతోనే చదువుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
ఈ క్రమంలో ఐశ్వర్య కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు షాద్ నగర్ కు వెళ్లారు. ఐశ్వర్య మరణం పట్ట తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన వారు.. బాధిత కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రూ.వెయ్యి కోట్లతో ఏడంతస్తుల మేడలు (సచివాలయం) కట్టే రాష్ట్రంలో... చదువుకు సాయం అందక ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. మొదటిది పాలకుడి విలాసం... రెండోది పేదరికపు విలాపం. ఇదీ నేటి తెలంగాణం’ అని రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ అన్ని వర్గాలను అలోచింపజేస్తోంది. కాగా, తన చావుకు ఎవరూ కారణం కాదని, తన వల్ల ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయని తెలుపుతూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తాను చదువు లేకపోతే బతకలేనని పేర్కొంది. స్కాలర్ షిప్ లు ఏడాదికి ఒక్కసారైనా వచ్చేలా చేయాలని ఆమె పేర్కొంది.
ఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఫర్ ఉమెన్ కాలేజీలో డిగ్రీ చదువుతున్న ఐశ్వర్యకు లాక్ డౌన్ తర్వాత హాస్టల్ లో ఉండేందుకు నిరాకరించారు. స్కాలర్ షిప్ కూడా రాకపోవటంతో ఆమె తీవ్ర ఇబ్బందులు పడింది. దీంతో ఇంటికి వచ్చి కుటుంబానికి భారం కాలేక, అలాగని చదువుకోకుండా ఉండలేక మానసిక వేధనతో ఐశ్వర్య షాద్ నగర్ లో ఉరివేసుకొని మరణించింది. తను ఐఎఎస్ కావాలన్న కల నెరవేరదన్న భయంతో ఆమె ఉరివేసుకుంది. ఈమేరకు సూసైడ్ నోట్ రాసింది. ఐశ్వర్య తండ్రి ఆటో మెకానిక్ కాగా, తల్లి సుమతి టైలర్ గా పనిచేస్తుంది. ఇద్దర్ని చదివించే స్థోమత లేకపోవటంతో ఐశ్వర్య అక్కను తల్లితండ్రులు చదువు మాన్పించారు. ఐశ్వర్య చదువు కోసం ఆయన తండ్రి ఉన్న ఇంటిని కూడా 2లక్షలకు కుదవపెట్టి చదివిస్తున్నట్లు తెలుస్తోంది.
రూ.వెయ్యి కోట్లతో ఏడంతస్థుల మేడలు కట్టే రాష్ట్రంలో... చదువుకు సాయం అందక ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. మొదటిది పాలకుడి విలాసం... రెండోది పేదరికపు విలాపం. ఇదీ నేటి తెలంగాణం @manickamtagore @tsnsui @VenkatBalmoor #aishwarya pic.twitter.com/y8ylzeJJxB
— Revanth Reddy (@revanth_anumula) November 9, 2020
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more