Financial crisis drives Telangana student to suicide ఐశ్వ‌ర్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన రేవంత్ రెడ్డి..

Revanth reddy critisizes telangana government over student suicide

Malkajgiri MP, Rahul Gandhi, Revanth Reddy, senior congress leader, Aishwarya, Student, Higher Studies, Lady Shri ram college, Delhi, Shadnagar, CM KCR, Telangana, Politics

Malkajgiri MP and Senior Congress leader Revanth Reddy critisizes Telangana Government over student suicide after condolesencing the Aishwarya Parents and paid his tribute.

ఐశ్వ‌ర్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్ సర్కార్ పై విసుర్లు

Posted: 11/09/2020 10:48 PM IST
Revanth reddy critisizes telangana government over student suicide

ఆర్థిక స్థోమ‌త స‌రిగ్గా లేక‌పోవ‌టంతో చ‌ద‌వుకోలేక ఓ విద్యాకుసుమం రాలిపోయింది. తనకు సరస్వతి కటాక్షం వున్నా లక్ష్మీ కటాక్షం లేదని దాంతో తన కుటుంబం తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని అవేదన చెందిన విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘటన అలస్యంగా దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణలోని పాల‌మూరు జిల్లా షాద్ న‌గ‌ర్ కు చెందిన విద్యార్థిని ఐశ్వ‌ర్య.. తనకు చదువుకునే మార్గం కానరాక ఆత్మహత్యకు పాల్పడటంతో ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అని ప్రచార ఆర్భటమే తప్ప.. వాస్తవంలో లేకనే అర్థికంగా అనగారిన ఓ విద్యాసుమం రాలిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. కేవ‌లం డబ్బులేకపోవ‌టంతోనే చ‌దువుకోలేక ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డిన ఘ‌ట‌న‌పై కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి.

ఈ క్రమంలో ఐశ్వ‌ర్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్ర‌భాక‌ర్ లు షాద్ న‌గ‌ర్ కు వెళ్ల‌ారు. ఐశ్వ‌ర్య మరణం పట్ట తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసిన వారు.. బాధిత కుటుంబానికి తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు, ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రూ.వెయ్యి కోట్లతో ఏడంతస్తుల మేడలు (సచివాలయం) కట్టే రాష్ట్రంలో... చదువుకు సాయం అందక ఐశ్వర్య ఆత్మహత్య చేసుకుంది. మొదటిది పాలకుడి విలాసం... రెండోది పేదరికపు విలాపం. ఇదీ నేటి తెలంగాణం’ అని రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ అన్ని వర్గాలను అలోచింపజేస్తోంది. కాగా, తన చావుకు ఎవరూ కారణం కాదని, తన వల్ల ఇంట్లో చాలా ఖర్చులు అవుతున్నాయని తెలుపుతూ ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. తాను చదువు లేకపోతే బతకలేనని పేర్కొంది. స్కాలర్ షిప్ లు ఏడాదికి ఒక్కసారైనా వచ్చేలా చేయాలని ఆమె పేర్కొంది.

ఐశ్వర్య ఆత్మహత్యకు అసలు కారణమేంటీ.?

 

ఢిల్లీలోని శ్రీ‌రామ్ కాలేజ్ ఫ‌ర్ ఉమెన్ కాలేజీలో డిగ్రీ చ‌దువుతున్న ఐశ్వ‌ర్య‌కు లాక్ డౌన్ త‌ర్వాత హాస్ట‌ల్ లో ఉండేందుకు నిరాక‌రించారు. స్కాల‌ర్ షిప్ కూడా రాక‌పోవ‌టంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ప‌డింది. దీంతో ఇంటికి వ‌చ్చి కుటుంబానికి భారం కాలేక‌, అలాగ‌ని చ‌దువుకోకుండా ఉండ‌లేక మాన‌సిక వేధ‌న‌తో ఐశ్వ‌ర్య షాద్ న‌గ‌ర్ లో ఉరివేసుకొని మ‌ర‌ణించింది. త‌ను ఐఎఎస్ కావాల‌న్న క‌ల నెర‌వేర‌ద‌న్న భ‌యంతో ఆమె ఉరివేసుకుంది. ఈమేర‌కు సూసైడ్ నోట్ రాసింది. ఐశ్వ‌ర్య తండ్రి ఆటో మెకానిక్ కాగా, త‌ల్లి సుమ‌తి టైల‌ర్ గా ప‌నిచేస్తుంది. ఇద్ద‌ర్ని చ‌దివించే స్థోమ‌త లేక‌పోవ‌టంతో ఐశ్వ‌ర్య అక్క‌ను త‌ల్లితండ్రులు చ‌దువు మాన్పించారు. ఐశ్వ‌ర్య చ‌దువు కోసం ఆయ‌న తండ్రి ఉన్న ఇంటిని కూడా 2ల‌క్ష‌లకు కుద‌వ‌పెట్టి చ‌దివిస్తున్నట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Malkajgiri MP  Rahul Gandhi  Revanth Reddy  Aishwarya  Student  Higher Studies  Shadnagar  CM KCR  Telangana  Politics  

Other Articles