యువతి, యువకుడు వివాహం చేసుకునే విషయంలో అలహాబాద్ న్యాయస్థానం తాజాగా సంచలన తీర్పును వెలువరించింది, వేర్వేరు మతాలకు చెందిన యువతీ యువకులు కూడా వివాహ బంధంతో ఒక్కటి కావచ్చునని తీర్పును వెలువరించింది, తమకు నచ్చిన వారితో కలిసి జీవించే హక్కు యువతీ యువకులకు వుందని ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది, ఇలా ఒక్కటైన యువతీ, యువకుల జీవితాల్లో కలగజేసుకునే హక్కు మాత్రం ఎవరికీ లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది, నచ్చినవారితో జీవించే హక్కు యువతకు వుందని రాష్ట్రోన్నత న్యాయస్థానం పేర్కోంది.
ఉత్తర్ ప్రదేశ్ లోని షహరాన్పూర్ కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్ లకు చెందిన కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది, భిన్న మతాలకు చెందిన యువతీ యువకుల వివాహబంధాన్ని ఇరువర్గాలకు చెందిన పెద్దలు అంగీకరించకపోవడంతో.. న్యాయస్తానాన్ని ఆశ్రయించిన వారికి న్యాయస్థానం ఈ మేరకు తీర్పును వెలువరించింది, ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. యూపీలోని షహరాన్ పూర్ కు చెందిన పూజా అలియాస్ జోయా, షావెజ్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఇంటి నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇది ఇష్టంలేని ఇరు కుటుంబసభ్యులు వారి కోసం అన్వేషించారు.
పూజా కుటుంబసభ్యుల అన్వేషణ ఫలించి ప్రేమికుల జాడ కనిపెట్టారు, అయితే వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. తెలిసినవారి ద్వారా బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మేజర్లమైన తమకు కలిసి జీవించే అవకాశం ఇవ్వాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు జడ్జి విచారణ చేపట్టారు. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు యువతిని కోర్టులో హాజరుపర్చారు. భర్తతోనే కలిఉంటానని ఆమె పేర్కొన్నారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ తీర్పు వెలువరించారు. ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం.. భిన్న మతాలకు చెందిన వారు వివాహం చేసుకోవచ్చు. అయితే వివాహాల కోసం మాత్రమే మతమార్పిడి చేపట్టడం మాత్రం సముచితం కాదని న్యాయస్థానం మరో కేసులో తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more