Coronavirus: India Record nearly 45,230 cases in a day దేశంలో ఒక్కరోజులో 45 వేల కేసులు.. 496 మరణాలు

Coronavirus in india covid cases surges near 82 lakh mark toll surges 1 22 lakh mark

Coronavirus cases India, Coronavirus India update, Coronavirus india testing centres, coronavirus vaccine, coronavirus testing india labs, coronavirus deaths india, Coronavirus, Covid-19, Maharashtra, Tamil Nadu, Delhi, Health Ministry, corona fatility, corona cases India

The number of active cases of the novel coronavirus in India dropped below eight lakh for the first time since September 20. India reported 45,230 new Covid-19 cases and 496 deaths in the last 24 hours. The country's tally of 82,29,313 cases included 5,61,908 active cases, 75,44,798 recoveries and 1,22,607 deaths.

దేశంలో కరోనా తగ్గుముఖం: 24 గంటల్లో 45 వేల దిగువకు కరోనా కేసులు.. 496 మరణాలు

Posted: 11/03/2020 08:27 PM IST
Coronavirus in india covid cases surges near 82 lakh mark toll surges 1 22 lakh mark

(Image source from: Livehindustan.com)

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభన కోనసాగిస్తోంది. గత ఏడు మాసాలుగా దేశప్రజలను భయాందోళనకు గురిచేస్తూ లక్షకు పైగా ప్రజల ప్రాణాలను బలితీసుకున్న కరోనా గత వారం రోజులుగా క్రమంగా తన ప్రభావాన్ని తగ్గించుకుంటోందని భావిస్తుండగా మళ్లీ కేసులు ఏకంగా యాభై లక్షల మార్కు చేరువలో నమోదు కావడం అందోళనకు కలిగిస్తోంది. దాదాపు ఆగస్టు మాసం నుంచి అంతకంతకూ పెరుగుతూ వచ్చిన కరోనా కేసులు విజృంభన తొలిసారిగా సెప్టెంబర్ 1 తరువాత ఇవాళ 38 వేల కేసులను నమోదు చేసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని భావించగా, ఇవాళ మళ్లీ కరోనా కేసులు నలబై ఐదువేల మార్కుకు చేరువలో నమోదయ్యాయి. మరోవైపు మహమ్మారి మరణ మృదంగాన్ని మ్రోగిస్తూ ఏకంగా 500లకు చేరువలో తాజాగా ప్రాణాలను బలిగొనింది. గత కొన్ని రోజులుగా ప్రతీరోజు వందల సంఖ్యలోనే సంభవిస్తున్న మరణాలు.. ఇవాళ మరోమారు 490లకు పైగా మరణాలు నమోదు కావడం దేశ ప్రజలను అందోళనకు గురిచేస్తోంది.

తాజాగా దేశంలో కరోనా బారిన పడి ఏకంగా లక్షా 20 వేల మంది మరణించగా, గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 490 మందికి పైగా కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఖ్యలో మరణాలు సంభవించడంతో దేశస్థులలో అందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ మరణాల్లో ఒక్క మహారాష్ట్రలోనే ఏకంగా 43.5 వేల మంది మృత్యువాత పడినట్టు గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలో ఏ రోజుకారోజు కొత్త కేసుల నమోదు చేసుకుంటూ రికార్డుస్థాయిలో దూసుకెళ్లిన కరోనా కేసులు.. ఇక దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి తన ఉద్దృతిని పెంచుతూ సమూహవ్యాప్తిలోకి చేరిందన్న సమాచారంతో దేశ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కేసుల సంఖ్య 38వేల 310 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తూ.. లక్షలాధి మందిని తన ప్రభావానికి గురిచేస్తూ.. లక్షల మంది ప్రాణాలను హరించిన కరోనా మహమ్మారి దేశంలోనూ తన ఉదృతిని శరవేగంగా విస్తరించుకుంటోంది.

దేశంలో క్రమంగా జడలువిప్పిన తరువాత క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా మహమ్మారి బారిన ఇప్పటివరకు మొత్తంగా 82.29 లక్షల మార్కును అందుకున్నాయి. ఫలితంగా కరోనా ప్రభావనపడిన దేశాల్లో అమెరికా అత్యధిక కేసులతో అగ్రస్థానంలో వుండగా ఆ తరువాత రెండవ స్థానంలో భారత్ నిలువడం.. దేశంలో కరోనా ప్రభావాన్ని తెలియజేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు ఉద్దృతి పెరుగుతున్న ఈ క్రమంలో కొంచెం కఠిన నిబంధనలు పెట్టాల్సిన కేంద్రం అన్ లాక్ 5.0 మార్గదర్శకాలలో రాకపోకలకు వెసలుబాటు కల్పించడం కూడా తీవ్రతను పెంచేందుకు కారణం అవుతుందన్న వాదనలు వినబడుతున్నాయి. స్వల్ప సంఖ్యలోని జనసమూహాలకు అనుమతులు కూడా లభ్యం కావడంతో.. కేంద్రం కూడా పలు ఆంక్షలను తొలగించి మరికోన్ని సడలింపులు కూడా అమల్లోకి రావడంతో మరిన్ని కేసులు పెరుగుతాయా.? అన్న అందోళన కూడా రేకెత్తుతోంది. ఆరు మాసాలు పైగా గడుస్తున్నా ఈ మహమ్మారి కట్టడికి ఇప్పటికీ వాక్సీన్ రాకపోవడం కూడా దేశ ప్రజల్లో అందోళనకు కారణమవుతోంది.

గత జూలై మాసంలో 19 లక్షల కేసులు ఇక ఆగస్టు మాసంలో మరో 20 లక్షల కేసులతో ఏకంగా రెండు నెలల వ్వవధిలోనే నలభై రెండు లక్షల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితి ఎంత భయాందోళనకరంగా మారిందో అర్థంచేసుకోవచ్చు. ఇదిలావుంటే సెప్టెంబర్ మాసంలో కరోనా దేశవ్యాప్తంగా జడలు విప్పింది. సెప్టెంబర్ 1 నాటికిక దేశంలో 3,691,166 కేసులు నమోదు కాగా, ఇక సెప్టెంబర్ 30 నాటికి ఈ సంఖ్య ఏకంగా రెట్టింపుకు చేరింది, సెప్టెంబర్ డేంజర్ ఎంతలా వుందంటే ఈ నేల రోజుల వ్యవధిలో ఏకంగా 25 లక్షల 34 వేల 597 కేసులు నమోదయ్యాయి, దీంతో కేసుల సంఖ్య 6,225,763కి చేరాయి, ఇక అక్టోబర్ మాసంలో ఇప్పటికే కరోనా విజృంభన తగ్గుముఖం పట్టిందని వస్తున్న వార్తలకు గణంకాలు కూడా అద్దం పడుతున్నాయి, ఈ నెలలో తాజా గణంకాల మేరకు (30 నాటికి) ఇప్పటి వరకు కేవలం 18 లక్షల 63 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి.

గత కొంత కాలంగా ప్రతీ రోజు ఎనమిది వందలకు పైబడిన సంఖ్యలో నమోదైన మరణాలు.. గడిచిన 24 గంటల్లో 490 మార్కును అందుకున్నాయి, ఇక తాజాగా మరణాల్లోనూ భారత్ ఏకంగా ప్రపంచంలో తృతీయ స్థానంలో నమోదు కావడం గమనార్హం. కాగా, ఇదే సమయంలో దేశంలో కరోనా రికవరీ రేటు కూడా అధికంగానే వుంది. దేశంలో కరోనా బారిన పడిన అరవై లక్షల మందిలో దాదాపుగా 76.03 లక్షలకు పైగా రోగులు కరోనా నుంచి రికవరీ అయ్యారు. అయితే అంతకంతకూ పెరుగుతున్న మరణాలు దేశ ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి, దేశంలో అక్టోబర్ 1 అమల్లోకి వచ్చినఅన్ లాక్ 5.0 నిబంధనలు మరికొంత కాలం పాటు కొనసాగనున్నాయి, ఈ మేరకు తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అదేశాలను జారీ చేసింది.

దీంతో పరిమిత సంఖ్యలోనే తిరిగిన వాహనాలు ఇకపై పూర్తిస్థాయిలో రోడ్డును ఎక్కనున్నాయి. మాల్స్, బార్లు, ధియేటర్లు, స్టేడియాల్లో ఆటలు ఇలా భారీ సంఖ్యలో జనసమూహం వున్న ప్రాంతాల్లో కార్యకలాపాలు మినహాయించి మిగిలిన అన్ని వ్యవహారాలకు అన్ లాక్ 5.0 తలుపులు తెరిచింది. దీంతో కరోనాకేసులు వ్యాప్తి కూడా గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా కొత్తగా 38,310 పాజిటివ్ కేసుల నమోదుతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ 82.67 లక్షల మార్కును అధిగమించింది. వీటిలో అత్యధిక కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లోనే నమోదయ్యాయి, వీటితో పాటు దేశంలో నిన్న ఏకంగా 490 మరణాలు నమోదయ్యాయి, దీంతో దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య లక్ష 23 వేల మార్కును అధిగమించింది.

దేశంలో నమోదవుతున్న కరోనా కేసులు, మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యదికంగా నమోదు కావడం గమనార్హం. మహారాష్ట్రలో అందులోనూ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరణాల సంఖ్య అధికంగా నమోదైంది, ఈ మహమ్మారి బారిన పడిన వారిలో గత 24 గంటల వ్యవధిలో 53.28 వేల మందికిపైగా కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని దీంతో మొత్తంగా ఇప్పటి వరకు దాదాపుగా 76.03 లక్షల మంది కోలుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 5.41 లక్షల యాక్టివ్ కేసులు వున్నాయని వారంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పోందుతున్నారు. అయితే కరోనా చికిత్స పోందుతున్న వారి కన్నా.. మహమ్మారి బారినపడి కోలుకుంటున్న వారి సంఖ్య పెరగడం కాస్త ఊరటనిస్తోంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు స్వల్పంగా తగ్గి 92.78 శాతంగా నమోదైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Coronavirus  Covid-19  Maharashtra  Tamil Nadu  Delhi  Health Ministry  corona fatility  corona cases India  

Other Articles