(Image source from: Twitter.com/trspartyonline)
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారపర్వానికి మరో రెండురోజుల్లో తెరపడనున్న తరుణంలో కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో వున్న బీజేపి, టీఆర్ఎస్ ల మధ్య విమర్శలు, అరోపణల పర్వం శృతిమించిపోతోంది. అధికార టీఆర్ఎస్.. దివంగత శాసనసభ్యుడు సోలిపేట రామలింగారెడ్డి అకస్మిక మృతితో ఉప ఎన్నికలు వచ్చిన ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని మూడు పార్టీలు సవాల్ గా తీసుకోగా.. రెండు అధికార పార్టీల మధ్య మాత్రం నువ్వా-నేనా అన్నట్లుగా వున్నాయి. ఈ నేపథ్యంలో గెలుపు తమకు ఎప్పుడో ఖాయమైందని అయితే మోజారీటీ కోసమే ప్రస్తుతం తమ ఆరాటమంతా అని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు.
టీఆర్ఎస్ పార్టీ తరఫున తమ అభ్యర్థి సోలిపేట సుజాతను గెలిపించే బాధ్యతను భుజాన వేసుకున్న మంత్రి హరీశ్ రావు తన ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేశారు. శిశుపాలుడి వంద తప్పులను శ్రీకృష్ణుడు లెక్కించినట్టు తాను బీజేపీ అబద్ధాలను లెక్కపెడుతున్నానని అన్నారు. బీజేపీ ఆడుతున్న అబద్ధాలను చూస్తుంటే శతసహ్రస అబద్దాలు ఆడైనా విజయాన్ని అందుకోవాలన్న ఆరాటమే కనిపిస్తుంది కానీ.. నిజంగా ప్రజలకు ఏం చేయాలన్న దానిపై మాత్రం అస్సలు దృష్టి పెట్టలేదని అన్నారు. బోర్ల సాయంతోనే తడిసే తెలంగాణలో బీజేపి అమర్చే మీటర్లు తిరగనిదే చుక్క నీరు రాదు.. సెంటు భూమి కూడా తడవదని అన్నారు.
ఇన్ని అబద్దాలను అవలీలగా అడుతున్న బీజేపీ భారతీయ జనతా పార్టీ అని కాకుండా భారతీయ ఝూటా పార్టీ (అబద్ధాల పార్టీ) అని పిలవాల్సి వస్తోందని వ్యంగ్యోక్తులు విసిరారు. బీజేపీ రాష్ట్ర నేతలు మొదలుకుని ఆ పార్టీ కార్యకర్తల వరకు ఒక్కరైనా నిజాలు మాట్లాడడంలేదని విమర్శించారు. సత్యమేవ జయతే అనే ఉపనిషత్ సూక్తిని విస్మరించారని, అసత్యమేవ జయతే అనే సూక్తిని నమ్ముతున్నారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా బీజేపీ తమకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న అంశాలను ఉదాహరించారు.
దుబ్బాకలో పాలిటెక్నిక్ కాలేజీని సిద్ధిపేటకు తీసుకెళ్లామని అరోపించిన బీజేపి నేతలు శంకుస్థాపన ఎక్కడ జరిగిందో కూడా చూపించాలని డిమాండ్ చేశారు. చేగుంటకు ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు కాగా... దాన్ని గజ్వేల్ తరలించారని.. దానికి రూ.25 కోట్ల నిదులు కూడా మంజూరయ్యాయని అరోపిస్తున్నారని అన్నారు. అసుపత్రి మంజూరుకు సంబంధించిన ఉత్తర్వుల కాగితం చూపిస్తారా? అని నిలదీశారు. విద్యుత్ నూతన ముసాయిదా చట్టం తెచ్చిన కేంద్రాన్ని తాము వ్యతిరేకిస్తున్న విషయాన్ని పక్కనబెట్టి కేసీఆర్ మీటర్లు పెడుతున్నారని ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు తూర్పారబట్టారు.
మరే రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు రూ.2,016 ఫించణు ఇస్తున్నా దానిని కూడా రాజకీయం చేయడం బీజేపికే చెల్లిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు, బీడీ కార్మికులకు ఫించనులో రూ.1,600 కేంద్రం ఇస్తోందని తప్పుడు ప్రచారాలతో గెలవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు రేషన్ బియ్యం వ్యవహారంలోనూ కేంద్రం రూ.29 ఇస్తే, రాష్ట్రం రూ.1 మాత్రమే ఇస్తుందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవం ఏంటంటే.... రేషన్ బియ్యం అంశంలో సగం మాత్రమే కేంద్రం నుంచి వస్తుంది. మిగతా సగం రాష్ట్ర సర్కారు భరిస్తుందని అన్నారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కోనుగోళ్లకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా కొనుగోళ్లు చేసిందని హరీశ్ రావు చెప్పారు.
దుబ్బాకలో రాష్ట్ర బిజెపి నాయకులు తమ వైఖరితో భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేసారు.
— TRS Party (@trspartyonline) October 30, 2020
పూటకో పుకారు పుట్టిస్తారు.. గంటకో అబద్ధం ఆడేస్తారు ఇదీ బీజేపీ నాయకుల నైజం.
- మంత్రి శ్రీ @trsharish #DubbakaWithTRS #VoteForCar pic.twitter.com/3kETS5RNgq
(And get your daily news straight to your inbox)
Apr 03 | ఉత్తరప్రదేశ్ లో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈసారి గ్లామరెస్ గా మారనున్నాయి. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ఫెమినా మిస్ ఇండియా -2015 రన్నరప్ దీక్షాసింగ్ ప్రకటించింది. జౌన్ పూర్ జిల్లా బక్షా... Read more
Apr 03 | ఎనబై ఏళ్లకు పైబడిన వయస్సులోనూ అమె తన జీవనం కోసం అలోచించకుండా పది మంది కడుపు నింపే పనికి పూనుకున్నారు. అందరూ తన బిడ్డల లాంటి వారేనని, అమె అందరికీ అందుబాటు ధరలోనే ఇడ్లీలు... Read more
Apr 03 | బెంగళూరు డ్రగ్స్ కేసు..శాండిల్ వుడ్ పరిశ్రమను షేక్ చేసి అక్కడి ప్రముఖులను ఊచలు లెక్కపెట్టించిన కేసుకు సంబంధించిన లింకులు తెలంగాణలోనూ బయటపడ్డాయి. ఆ మధ్య పలువురు నటుల చు్ట్టూ తిరిగిన ఈ కేసులో వారి... Read more
Apr 03 | అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్న అసోంలో బీజేపీకి దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. అసోం బీజేపి ప్రతినిధిగా ముఖ్యమంత్రి సోనూవాల్ ను అధిగమించి మరీ దూసుకుపోతున్న రాష్ట్ర మంత్రి హిమంత విశ్వశర్మపై చర్యలు తీసుకున్నఎన్నికల కమీషన్... Read more
Apr 03 | తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అంకానికి మరికొన్ని గంటల వ్యవధిలో తెరపడుతుందన్న తరుణంలో రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు, అరోపణలు ఊపందుకుంటున్నాయి. మరీముఖ్యంగా బీజేపిని టార్గెట్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే అధినేత... Read more