(Image source from: Twitter.com/KTRTRS)
ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగడంతో కాలుష్య సమస్యకు కొంతవరకు చెక్ పెట్టవచ్చునని, దీంతో పాటు ఇంధన నిల్వలను భవిష్యతరాలకు నిల్వ చేసుకునే వెసలుబాటు కూడా కలుగుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల నూతన విధానం అద్భుత విజయాన్ని అందుకోనుందని, తద్వారా తెలంగాణ ఈ వాహనాలకు హబ్ గా మారబోనుందని ఆశాభావం వ్యక్తం చేశారు, ఇందుకు అనువైన నూతన విధానాన్ని ఎలక్ట్రిక్ వాహనాల శిఖరాగ్ర సదస్సులో మంత్రులు పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి కేటీఆర్ విడుదల చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల విస్తృతికి సహకారం, భాగస్వామ్యం అనే అంశంపై సదస్సులో చర్చించిన ఆయన ఈ ఎలక్ట్రికల్ వాహనాల కోనగోళ్లుకు ప్రోత్సాహకాలు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ధరల పరంగా ఎక్కువ ఆసక్తిని కనబర్చని కస్టమర్లు ఇక ఇవి అందుబాటు ధరలోనే సమకూరడంతో ఆసక్తి కనబర్చే అవకాశాలు వున్నాయి. ఇక ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసిన వారికి పదేళ్ల వరకు రోడ్ టాక్స్ నుంచి మినహాయింపుతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలు నుంచి కూడా మినహాయింపు కల్పించేవిధంగా నూతన ఎలక్ట్రికల్ వాహనాల విధానం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇటు ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలకు కూడా భారీ రాయితీలను ప్రకటించింది,
తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నాయని అన్నారు. ఛార్జింగ్ స్టేషన్లు, బ్యాటరీ తయారీ కంపెనీలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ మేరకు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రంలో భూములు అందుబాటులో ఉన్నాయని.. మహేశ్వరంలో వేల ఎకరాలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. మహీంద్ర అండ్ మహీంద్ర ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ లు వీడియో కాన్షరెన్స్ ద్వారా సదస్సులో పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more