(Image source from: Twitter.com/AndhraPradeshCM)
దేశపౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని చైనాకు చెందిన పలు యాప్ లు తస్కరిస్తున్నాయన్న నేపథ్యంలో ఇప్పటికే పలు యాప్ లను కేంద్రప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో దేశప్రజలకు చెందిన డబ్బును కూడా ప్రలోభాలకు గురిచేసి పలు యాప్ లు దోచుకుంటున్నాయని వాటిపై కూడా కేంద్రప్రభుత్వం దృష్టిసారించి నిషేధించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్రప్రభుత్వానికి లేఖ రాశారు. ఆన్ లైన్ గ్యాంబ్లింగ్, బెట్టింగ్ వెబ్ సైట్లు, యాప్ లపై కూడా కేంద్రం కొరడా జుళిపించాలని కోరారు. కేంద్ర న్యాయశాఖా మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు ఈ మేరకు ఆయన ఓ లేఖ రాశారు.
ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశంలోని వివిధ రాష్ట్రాల యువత అన్ లైన్ గ్యాంబ్లింగ్ గేముల మొజులో పడిసర్వం కోల్పుతున్నారని వాటి బారి నుంచి తప్పించుకునే మార్గం కనబడక బలవంతంగా ప్రాణాలను త్యజిస్తున్నారని అందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కోసం ఆలోచించాల్సిన యువత గ్యాంబ్లింగ్ ఉచ్చులో చిక్కి.. బానిసలుగా మారుతున్నారని, ఆర్థికంగా చితికిపోతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వీటి బారినపడి నష్టపోయిన వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లు, గ్యాంబ్లింగ్ పై ఉక్కుపాదం మోపేందుకు 1974 ఏపీ గేమింగ్ చట్టంలో సవరణలు కూడా తీసుకొచ్చినట్టు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో మినిక్లిప్, ఈఏ డాట్ కామ్ సహా మొత్తం 132 వెబ్సైట్లు గ్యాంబ్లింగ్, బెట్టింగుకు కారణమవుతున్నాయని, వాటిని నిషేధించాలని కోరుతూ వాటి వివరాలను ముఖ్యమంత్రి తన లేఖకు జతచేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more