(Image source from: news.tirumala.org)
కలియుగ ప్రత్యేక్షదైవం తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏడవ రోజు ఉదయం మలయప్పస్వామి.. సప్తఅశ్వవాహనుడైన సూర్యనారాయణ మూర్తి అవతారంలో దర్శనమిచ్చారు. సూర్యనారాయణమూర్తిగా ఏడు అశ్వాల వాహనమైన సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రధానం చేశారు. ఈ సూర్యప్రభ వాహనంపై ఊరేగుతున్న ప్రత్యక్షదైవం సూర్యానారాయణమూర్తిని దర్శించడం వల్ల అన్ని శుభాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. సకల రోగాలను బాపే సూర్యనారాయణ మూర్తి దర్శనంతో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, భాగ్యం సిద్దిస్తాయని భక్తుల విశ్వాసం. సూర్యప్రభ వాహనంపై విహరించిన స్వామి వైభవాన్ని చూసి భక్తులు పులకించిపోయారు.
మంగళ వాయిద్యాల మధ్య జీయంగార్లు, పండితులు, అర్చకుల వేదమంత్రోచ్ఛరణల నడుమ సూర్యనారాయణమూర్తికి వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక ఇవాళ రాత్రి ఏడు గంటలకు శ్రీవారి బ్రహోత్సవాలలో భాగంగా చంద్రప్రభ వాహన సేవను టీటీడీ నిర్వహించనుంది. ఉత్సవాల్లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పుష్పకవిమాన సేవ, రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహన సేవ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి ఆగమోక్తంగా నిర్వహించే కార్యక్రమాలన్నీ యథాతథంగా నిర్వహిస్తారు.
కరోనా ప్రభావంతో ఉత్సవాలను ఆలయానికే పరిమితం చేశారు. సాధారణంగా బ్రహోత్సవాల సమయంలో ఇసుకేసినా రాలనంతగా భక్తులు తిరుమల కోండకు చేరుకుని దేవదేవుడి వివిధ రూపాల్లో దర్శించి అభయాన్ని పోందేందుకు పోటీపడతారు. ప్రతీఏడు కలియుగ వైకుంఠమైన తిరుమల పవిత్ర తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తజన సందోహానికి అభయప్రధానం చేసే శ్రీవారు ఈ సారి కరోనా నేపథ్యంలో ఆలయానికి మాత్రమే ఉత్సవాలు పరిమితమయ్యాయి, ఇక ఈ బ్రహ్మోత్సవాల వేడుకలకు కూడా పరిమితి సంఖ్యలోనే భక్తులు వస్తున్నారు. ముందుగా టికెట్లు పోందిన భక్తులతో పాటు ధర్మదర్శన టికెట్లు పోందిన భక్తులను మాత్రమే తిరుమల కోండపైకి తితిడీ అధికారులు అనుమతిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more